PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- ధర్మపురి లాడ్జ్లో మకాం.. సీసీటీవీ క్లూస్
- షాబొద్దీన్ ట్రాక్లో పోలీసులు
- గోదావరి దాటి పరారీ ప్లాన్
- 16 బృందాలతో భారీ గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMJ Jewellers : కరీంనగర్ నగరంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్లో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దుండగుల కదలికలు , వారి నేపథ్యానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు సేకరించారు.
దోపిడీకి పాల్పడిన ఐదుగురు దుండగులు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జ్లో మూడు రోజుల పాటు బస చేశారు. లాడ్జ్లోని సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. కరీంనగర్లో దోపిడీ ముగించుకున్న తర్వాత, దొంగలు మళ్లీ తిరిగి ధర్మపురి మీదుగానే పరారయ్యారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల గోదావరి నది ప్రవాహం తక్కువగా ఉండటంతో, వారు తమ బైకును అక్కడే వదిలేసి నది దాటి పారిపోయినట్లు సమాచారం. అక్కడి నుండి మరో బైకుపై వారు ఎటువైపు వెళ్లి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
ఈ దోపిడీ వెనుక మాస్టర్ మైండ్గా షాబొద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలోనే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. గతంలో ముంబైలోని బోరివిల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో నిందితుడిగా ఉన్న షాబొద్దీన్, పూణే జైలులో శిక్ష కూడా అనుభవించాడు. మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఇతని వివరాలను సేకరించిన తెలంగాణ పోలీసులు, అతనే ఈ ముఠాకు నాయకత్వం వహించినట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఈ సమాచారంతో తెలంగాణ పోలీసుల బృందాలు మహారాష్ట్రకు చేరుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా తీసుకోవడంతో, పోలీస్ శాఖ దీనిని ఒక సవాల్గా భావిస్తోంది. నిందితులు ధర్మపురి గోదావరి దాటి, ఆదిలాబాద్ అడవుల గుండా మహారాష్ట్ర వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 16 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహాయంతో నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
-
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
ట్రెండింగ్
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!