PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- ధర్మపురి లాడ్జ్లో మకాం.. సీసీటీవీ క్లూస్
- షాబొద్దీన్ ట్రాక్లో పోలీసులు
- గోదావరి దాటి పరారీ ప్లాన్
- 16 బృందాలతో భారీ గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMJ Jewellers : కరీంనగర్ నగరంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్లో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దుండగుల కదలికలు , వారి నేపథ్యానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు సేకరించారు.
దోపిడీకి పాల్పడిన ఐదుగురు దుండగులు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జ్లో మూడు రోజుల పాటు బస చేశారు. లాడ్జ్లోని సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. కరీంనగర్లో దోపిడీ ముగించుకున్న తర్వాత, దొంగలు మళ్లీ తిరిగి ధర్మపురి మీదుగానే పరారయ్యారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల గోదావరి నది ప్రవాహం తక్కువగా ఉండటంతో, వారు తమ బైకును అక్కడే వదిలేసి నది దాటి పారిపోయినట్లు సమాచారం. అక్కడి నుండి మరో బైకుపై వారు ఎటువైపు వెళ్లి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ఈ దోపిడీ వెనుక మాస్టర్ మైండ్గా షాబొద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలోనే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. గతంలో ముంబైలోని బోరివిల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో నిందితుడిగా ఉన్న షాబొద్దీన్, పూణే జైలులో శిక్ష కూడా అనుభవించాడు. మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఇతని వివరాలను సేకరించిన తెలంగాణ పోలీసులు, అతనే ఈ ముఠాకు నాయకత్వం వహించినట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఈ సమాచారంతో తెలంగాణ పోలీసుల బృందాలు మహారాష్ట్రకు చేరుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా తీసుకోవడంతో, పోలీస్ శాఖ దీనిని ఒక సవాల్గా భావిస్తోంది. నిందితులు ధర్మపురి గోదావరి దాటి, ఆదిలాబాద్ అడవుల గుండా మహారాష్ట్ర వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 16 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహాయంతో నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!