Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nanda deepam: పురాణాల ప్రకారం ఏదైనా దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాలు ఉంచితే ఆ ప్రాంతం, గుడి, గ్రామస్తులు సుఖ సంతోషాలతో, శాంతి, సౌభాగ్యాలతో జీవిస్తారని చెబుతారు. ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతుంటారు. అందుకే ఆలయాల్లో దీపారాధన తప్పనిసరిగా చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వెలసిన శ్రీసీతారామస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇల్లు, గుడి, పాఠశాల ఎక్కడ నిర్మించినా దీపం వెలిగిస్తారు. అయితే ఈ ఆలయంలోని నంద దీపం ఎప్పుడూ గొప్ప దీపంలా వెలుగుతూ ఉంటుంది. ఈ నందా దీపం ఒకట్రెండు సంవత్సరాలే కాదు సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని 1314లో కాకతీయుల చివరి రాజు ప్రతాప రుద్రుడు ఆలయ గంటపై చెక్కిన అంకెల ఆధారంగా తెలుస్తుంది. అంతటి పురాతన ఆలయంలోని నంద దీపం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన నందదీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూ ఉండడం విశేషం. దాని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం.
Read also: Chess Player Cheating: బుర్కా ధరించి మహిళల టోర్నమెంట్లో పాల్గొన్నాడు.. కానీ చివరికి..!
Also Read
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ఆలయ నిర్మాణ సమయంలో ఆనాటి రాజులు నిత్యం దీపం వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులో కొంత భాగం దీపానికి నూనెను కొనుగోలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. రాజుల కాలం ముగిసిన తర్వాత గ్రామంలోని దాతలు దీపానికి నూనెను అందించేవారు. గంభీరావుపేటకు చెందిన ఐత రాములు, ప్రమీల దంపతులు జీవితకాలం సరఫరా చేస్తామన్న హామీ మేరకు ప్రస్తుతం నూనె సరఫరా చేస్తున్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఏటా కల్యాణం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయంతో పాటు నంద దీపాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆలయం ముందు కల్యాణ మండపం 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో అందంగా నిర్మించబడింది. ఇది ఆలయ ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామస్వామి కల్యాణం జరుగుతుంది. కల్యాణ మహోత్సవంతో పాటు నందదీపాను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు.
Sai Dharam Tej: ‘విరూపాక్ష’ పెద్దలకు మాత్రమేనా!?
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!