Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?
Nanda deepam: పురాణాల ప్రకారం ఏదైనా దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాలు ఉంచితే ఆ ప్రాంతం, గుడి, గ్రామస్తులు సుఖ సంతోషాలతో, శాంతి, సౌభాగ్యాలతో జీవిస్తారని చెబుతారు. ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతుంటారు. అందుకే ఆలయాల్లో దీపారాధన తప్పనిసరిగా చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వెలసిన శ్రీసీతారామస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇల్లు, గుడి, పాఠశాల ఎక్కడ నిర్మించినా దీపం వెలిగిస్తారు. అయితే ఈ ఆలయంలోని నంద దీపం ఎప్పుడూ గొప్ప దీపంలా వెలుగుతూ ఉంటుంది. ఈ నందా దీపం ఒకట్రెండు సంవత్సరాలే కాదు సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని 1314లో కాకతీయుల చివరి రాజు ప్రతాప రుద్రుడు ఆలయ గంటపై చెక్కిన అంకెల ఆధారంగా తెలుస్తుంది. అంతటి పురాతన ఆలయంలోని నంద దీపం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన నందదీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూ ఉండడం విశేషం. దాని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం.
Read also: Chess Player Cheating: బుర్కా ధరించి మహిళల టోర్నమెంట్లో పాల్గొన్నాడు.. కానీ చివరికి..!
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఆలయ నిర్మాణ సమయంలో ఆనాటి రాజులు నిత్యం దీపం వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులో కొంత భాగం దీపానికి నూనెను కొనుగోలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. రాజుల కాలం ముగిసిన తర్వాత గ్రామంలోని దాతలు దీపానికి నూనెను అందించేవారు. గంభీరావుపేటకు చెందిన ఐత రాములు, ప్రమీల దంపతులు జీవితకాలం సరఫరా చేస్తామన్న హామీ మేరకు ప్రస్తుతం నూనె సరఫరా చేస్తున్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఏటా కల్యాణం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయంతో పాటు నంద దీపాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆలయం ముందు కల్యాణ మండపం 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో అందంగా నిర్మించబడింది. ఇది ఆలయ ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామస్వామి కల్యాణం జరుగుతుంది. కల్యాణ మహోత్సవంతో పాటు నందదీపాను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు.
Sai Dharam Tej: ‘విరూపాక్ష’ పెద్దలకు మాత్రమేనా!?
తాజావార్తలు
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!