Madhu Yaskhi: తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhu Yaskhi: ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఎద్దేవ చేశారు. గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని ఆరోపించారు. తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదు అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. Nri శాఖ కూడా పెడతా అన్నారని తెలిపారు. కథర్ లో వేల మంది కార్మికులను బయటకి పంపిస్తున్నారని , 25 వేల మందిని బయటకు పంపారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డ్ కూడా తీసేసింది ఈ ప్రభుత్వం మని తీవ్ర విమర్శలు చేశారు.
Nri పాలసీ వెంటనే అమలు చేయాలని డిమాండ్చేశారు. కేంద్రం కూడా nri శాఖ తీసేసిందని, కథర్ నుండి వచ్చే కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి, ఇప్పటి వరకు నియామకాలు లేవని అన్నారు. తెలంగాణ లిక్కర్ పాలసీ పంజాబ్, ఢిల్లీ పాలసీ నే కాపీ కొట్టిందని ఆరోపించారు. బేవరేజ్ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళక కట్టబెట్టారని మండిపడ్డారు. అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణ లొనే అని, డ్రగ్స్ అమ్మకాల్లో తెలంగాణ టాప్ అయ్యిందని ఆరోపించారు. డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో అర్థం కాలేదని తెలిపారు యాష్కీ. తెలంగాణ లిక్కర్ పాలసీ పై సీబీఐ విచారణ జరగాలని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ అని గుర్తు చేశారు. 2013 లో పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసి, ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసిందని తెలిపారు. ఇప్పుడేదో బీజేపీ చేసినట్టు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. ప్రధాని వచ్చినప్పుడే.. టీఆర్ఎస్ గొడవ చేస్తుందని అన్నారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ కాళ్ళ మీద పడి వస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, బీజేపీ పంచాయతీ అని ఎద్దేవ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని, గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నిక సీరియస్ గానే తీసుకుంటుందని, అందరూ కలిసి పని చేశారన్నారు. కంటిన్యూగా ఓడిపోవడం విచారకరమన్నారు. తెలంగాణ లో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదు అనే దానిపై సమీక్ష చేయాలని తెలిపారు. ధన ప్రభావం ఒక్కటే ఉండదని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణ బాద్యత లు తీసుకుంటారని తెలిపారు. త్వరలోనే సమీక్ష జరుగుతుందని అన్నారు. సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు ఉంటాయన్నారు. జోడో యాత్రలో నాయకుల ఐక్యత కనపడింది.. ఇది మంచి పరిణామన్నారు. కమ్యూనిస్టులు మాతో ఉండే కానీ.. ఇప్పుడు లేరని స్పష్టం చేశారు. టీడీపీ కూడా పెంచుకునే పనిలో ఉందని అన్నారు. పార్టీ క్రమశిక్షణకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యల తీసుకుంటామన్నారు.
CM Jagan : ఐటీసీ స్పైస్ ప్లాంట్ – వండర్పుల్ మూవ్మెంట్
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!