Asaduddin Owaisi: ‘‘మీకు అంత సానుభూతి ఉంటే’’.. అమిత్షాపై ఓవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ కీలక ప్రకటన చేశారు. అయితే దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీకి సమాజంపై అంత శ్రద్ధ ఉంటే బీసీ కులగణణ ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతి (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఒక రోజు తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం రాత్రి జహీరాబాద్ సభలో మాట్లాడిన ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కవలలు అంటూ విమర్శించారు. ఈ రెండు కూడా తెలంగాణలో విజయం సాధించలేవని ఆయన అన్నారు. ‘‘ అమిత్ షా గారు, మీకు బాధ్యతతో చెబుతున్నాను, మీరు కాంగ్రెస్ కవలలు అయ్యారు. తెలంగాణలో ప్రజలు మీకు అనుకూలంగా లేరు. మీకు బైబై చెబుతారు’’ అంటూ ఓవైసీ అన్నారు.
Also Read
పార్లమెంట్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్ కోటా కల్పించాలన్న తన డిమాండ్కు ప్రధాని మోదీ గానీ, కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ గానీ మద్దతు ఇవ్వలేదని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రస్తావిస్తూ.. బీజేపీ వాషింగ్ మిషన్గా మారిందా..? అని ప్రశ్నించారు.
Read Also: Iran: హిజాబ్ ధరించలేదని అమ్మాయిపై దాడి.. నెల రోజుల కోమా తర్వాత మృతి
బీజేపీతో ఎంఐఎంకి సంబంధం ఉందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ.. 2019 ఎన్నికల్లో అమేథిలో ఆయన ఎలా ఓడిపోయారని అడిగారు. 2019లో బీజేపీ, కాంగ్రెస్ 185 స్థానాల్లో ప్రత్యక్ష పోటీలో ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేయలేదని, కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని ఆయన ప్రస్తావించారు.
వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ లేని చోట టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని ఓవైసీ అన్నారు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే మీ సమస్యలపై స్పందించే వారే ఉండరని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!