Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News We Are Implement All Promises Cm Revanth Reddy

CM Revanth Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..

Published Date :March 17, 2025 , 5:36 pm
By Chandra Shekhar Pamena
  • రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..
  • మొదటి ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం: సీఎం రేవంత్
CM Revanth Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. 15 నెలలు పూర్తి చేసుకున్నాం.. మొదటి ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం.. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం.. 150 కోట్ల ట్రిప్పులు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు.. 50 లక్షల మందికి ఇంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 43 లక్షల కుటుంబాలకు 500 రూపాలయకే సిలిండర్లు అందుతున్నాయి.. స్వయం సహాయక సంఘాలలో 65 లక్షల మంది ఉన్నారు.. వాళ్లకు రెండేసి చీరలు.. మన ఇంటికి ఆడబిడ్డలు వస్తే ఎలాంటి చీర పెడతమో అలాంటి చీరలు ఇస్తాం.. స్కూల్స్ కి కంప్యూటర్ టీవీలు ఇచ్చారు కానీ.. కరెంట్ ఇవ్వడం మర్చిపోయారు అని ఎద్దేవా చేశారు. ఆ కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం.. పిల్లల అటెండెన్స్ టీచర్లు తీసుకుంటే.. టీచర్ల అటెండెన్స్ మహిళా సంఘాలకు ఇచ్చిన.. బలహీన వర్గాల లెక్కనే చెప్పనప్పుడు.. మాకు నిధులు, ఉద్యోగం ఎట్లా ఇస్తారని బాధ పడ్డారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Nitish Kumar Reddy: ‘కాటేరమ్మ కొడుకు’గా మారిన నితీశ్ కుమార్ రెడ్డి.. బ్యాట్లనే కత్తులుగా!

ఇక, ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లు సభలో పెట్టామని సీఎం రేవంత్ తెలిపారు. రేపు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందుతుంది.. స్పష్టమైన విధాన పాలసీలతో ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం.. బీసీల కోసం ఇది తొలి అడిగే ఇంకా చాలా చేయాల్సి ఉంది చేస్తామన్నారు. రాష్ట్ర అప్పులు పెరిగాయి, అయినా కూడా ధైర్యంగా పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం.. దుబారా ఖర్చు తగ్గించాం.. 14 నెలలు ఇసుక అమ్మకం పట్టించుకోలేదు.. కోటీ ఆదాయం వచ్చింది రోజు.. నెల రోజుల నుంచి అధికారులను ఒత్తిడి చేస్తే మూడు కోట్లకు పెరిగింది అన్నారు.. జీఎస్టీ కట్టడంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.. గుజరాత్ ఆరో ప్లేస్ లో ఉంది.. భారత దేశంలో నిత్యావసర ధరలు తక్కువ ఉన్నది తెలంగాణలోనే.. ఇవీ మేము చెప్తున్న లెక్కలు కావు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలేన్నారు. పరిపాలన మీద పట్టు రానట్టు ఉంది అంటున్నారు.. పట్టు అంటే అధికారులను జైల్లో పెట్టడం కాదు అని తేల్చి చెప్పారు. ఇద్దరు మంత్రులను తొలగించడం కాదు.. ఎమ్మెల్యేలు వచ్చి మన వెంట తిరిగిన వాళ్లకు ఏం పని చేయడం లేదని అంటున్నారు.. అందుకే రాజీవ్ యువ వికాసం తెచ్చాం.. అర్హులకే పథకాలు ఇవ్వండి.. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి.. ఆరోపణలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చాము.. ఆరోపణలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీ చేశామన్నారు.

Read Also: SBI Yono App: SBI వినియోగదారులకు అలర్ట్.. ఈ యాప్ పని చేయదు..!

అయితే, కలక్టర్ నీ బదిలీ చేయడం ఈజీ.. ఉపాధ్యాయుని బదిలీ చేయడం కష్టం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి బదిలీలు నిజాయితీగా చేశాం.. మన వెంట ఉన్న వాళ్లకు పథకాలు ఇవ్వడం కాదు.. పొలిటికల్ పోస్టులు ఇవ్వండి అని సూచించారు. అర్హత లేకున్నా.. పథకాలు ఇవ్వకండి.. ఇళ్లు, పథకాల విషయంలో మైనార్టీలకు సముచిత న్యాయం కల్పించాలి.. మండలాల వారీగా సమావేశాలు పెట్టండి.. అందరికీ పని కల్పించండి అని ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక, రాష్ట్రంలో గంజాయి ఎక్కువైంది.. పంజాబ్ నీ త్వరలో చేరుకునే అవకాశం ఉంది.. దీని నుంచి బయట పడాలి.. యువతను కాపాడుకోవాలి.. ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • congress
  • hyderabad
  • Rajiv Yuva Vikasam scheme
  • telangana

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions