Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు!
- బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..
- గతవారం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చింది..
- కేంద్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ను ఇంకా పరిశీలించలేదు..
- బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఏవిధంగా నష్టం జరుగుతుందో..
- కేంద్రానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.. ఎందుకు బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలనే దానిపై పూర్తి వివరాలతో జల వనరుల శాఖను కలవాలి అని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే, గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ ఇచ్చిందని అన్నారు. కేంద్రం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదు.. బనకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవలేదు.. అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుంది.. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: ECI: రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్పై ఎన్నికల సంఘం ఆగ్రహం..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎలిజిబిలిటీ వచ్చింది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.. నేను మరోసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండను.. సేవ్ తెలంగాణ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుంది.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తాం అన్నారు. బీజేపీ నేతగా ఈటల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లలేదు.. గత ఆర్థిక మంత్రిగా ఈటల విచారణకు వెళ్లారు.. బీజేపీ స్టాండ్ చెప్పాలని కమిషన్ అడగలేదు.. ఆర్థిక మంత్రిగా ఏం జరిగిందో ఈటల కమిషన్ ముందు వివరించారు.. ఇక, తుమ్మల నాగేశ్వర్ రావు ఆల్ పార్టీ మంత్రి.. బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో మంత్రిగా పని చేశారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!