ECI: రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్పై ఎన్నికల సంఘం ఆగ్రహం..
- రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్పై ఈసీ ఆగ్రహం..
- ప్రతికూల ఫలితాలు వస్తే పరువుతీసే ప్రయత్నం..
- ఇప్పటికే కాంగ్రెస్ అనుమానాలు తీర్చామన్న ఈసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ECI: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం( ECI) తీవ్రంగా ఖండించింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘‘రిగ్గింగ్’’ చేయబడ్డాయని ఆయన వ్యాఖ్యానించడాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం రాజీపడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం” అని పోల్ సంఘం తన బలమైన పదాలతో కూడిన సమాధానంలో పేర్కొంది.
Read Also: Murshidabad Riots: ముర్షిదాబాద్ అల్లర్లు.. తండ్రీకొడుకుల హత్యలో 13 మంది నిందితులు..
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
దీనికి ముందు, రాహుల్ గాంధీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని, ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో పెంచారని ఆరోపించారు. ఈ వాదనలపై ఈసీ స్పందిస్తూ.. మొత్తం ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు హాజరైనట్లు పేర్కొంది. అసాధారణ ఓటింగ్ గురించి కాంగ్రెస్ అధీకృత ఏజెంట్లు ఎప్పుడూ ఎటువంటి అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు లేవనెత్తలేదని కమిషన్ పేర్కొంది.
ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాన్ని నియంత్రించే చట్టంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక ప్యానెల్ నుంచి తొలగించడం ద్వారా కేంద్రాన్ని అనుకూల ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలు ఆధారాలు లేనివని, గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన కొద్దిసేపటికే కాంగ్రెస్ లేవనెత్తిన అన్ని ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లు పోల్ ప్యానెల్ చెప్పింది. “ఎన్నికల కమిషన్ డిసెంబర్ 24, 2024న INCకి ఇచ్చిన సమాధానంలో ఈ వాస్తవాలన్నింటినీ బయటపెట్టింది, ఇది ECI వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇలాంటి అంశాలను మళ్లీ మళ్లీ లేవనెత్తుతూ ఈ వాస్తవాలన్నింటినీ పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది…” అని ECI తెలిపింది.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!