Central Team: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..
- వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు అధికారులతో కూడిన కేంద్ర బృందం..
- సోమవారం హైదరాబాద్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Team: వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు అధికారులతో కూడిన కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి ప్రత్యక్ష పరిశీలనకు జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరద నష్టాన్ని నేరుగా పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వెళ్లారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పరిశీలించారు. నష్టాలు భారీగా ఉన్నందున బాధితులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందేలా అన్ని వివరాలు సేకరించి నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విపత్తు కింద ఇచ్చే నిధులను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా బాధితులకు ఖర్చు చేసేందుకు వీలుగా కఠిన నిబంధనలను కూడా సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
Read also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..
Also Read
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, మరి కొన్ని జిల్లాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయాయిన విషయం తెలిసిందే. వరదల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయం చేసేందుకు వీలుగా వరద నష్టంపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 5,438 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా…రోడ్లు, భవనాల శాఖ కింద రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖ కింద రూ.175 కోట్లు, పంటల కింద రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖ కింద రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ కింద రూ.170 కోట్లు. , మున్సిపల్ శాఖ కింద రూ.1,150 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. రూ.కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. 2 వేల కోట్లు తక్షణ సాయం. వారం రోజులుగా అతలాకుతలమైన వరదల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో.. అసలు నష్టం మాత్రం ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతే వరద నష్టంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!