Central Team: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..
- వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు అధికారులతో కూడిన కేంద్ర బృందం..
- సోమవారం హైదరాబాద్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Team: వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు అధికారులతో కూడిన కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి ప్రత్యక్ష పరిశీలనకు జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరద నష్టాన్ని నేరుగా పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వెళ్లారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పరిశీలించారు. నష్టాలు భారీగా ఉన్నందున బాధితులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందేలా అన్ని వివరాలు సేకరించి నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విపత్తు కింద ఇచ్చే నిధులను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా బాధితులకు ఖర్చు చేసేందుకు వీలుగా కఠిన నిబంధనలను కూడా సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
Read also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, మరి కొన్ని జిల్లాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయాయిన విషయం తెలిసిందే. వరదల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయం చేసేందుకు వీలుగా వరద నష్టంపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 5,438 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా…రోడ్లు, భవనాల శాఖ కింద రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖ కింద రూ.175 కోట్లు, పంటల కింద రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖ కింద రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ కింద రూ.170 కోట్లు. , మున్సిపల్ శాఖ కింద రూ.1,150 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. రూ.కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. 2 వేల కోట్లు తక్షణ సాయం. వారం రోజులుగా అతలాకుతలమైన వరదల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో.. అసలు నష్టం మాత్రం ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతే వరద నష్టంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!