Revanth Reddy: అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ తీసేస్తామంటే ఏడుస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భూమి డిక్లరేషన్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వెనక పెద్ద గూడు పుటాని జరిగింది.. రోజుకోకటి బయట పెడతామని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ టేరసీసీ కంపనీ వెనుక.. ఫిలిప్పీన్.. దాని వెనక అమెరికా కంపెనీలు వచ్చాయన్నారు. విదేశీయులు ధరణి పోర్టల్ నడుపుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఆ కంపనీ వివరాలు ఇవ్వండి అని అమెరికాని అడిగినా ఇవ్వడం లేదు.. దేశంలో ఏ సంస్థ వ్యాపారం చేసినా లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పాలి.. ఒక్క శాతం మాత్రమే.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపనీ చేతిలో ఉంది.
Also Read: Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
ఇది మంత్రి కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె దగ్గర ధరణికి ఉంది.. అర్ధరాత్రి పూటా… యజమానులను సృష్టించి భూమి కొల్లగొడుతున్నాడు అని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిని నడిపే వాడు.. ఎవడో తెలియదు.. ప్రభుత్వ భూములు.. మన భూముల వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది అత్యంత తీవ్రమైన నేరం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గజ్వెల్ లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంది.. దాన్ని ఆముల్ డైరీకి ఇచ్చాడు.. గంగుల కమలాకర్ కంపనీకి కూడా భూములు ఇచ్చారంటూ మండిపడ్డారు.
Also Read: Maamannan :జూలై 14న తెలుగులో నాయకుడు’గా మామన్నన్ రిలీజ్
దేవాదాయ భూములు.. ఫార్మ కంపనీకి ఇస్తే.. హైకోర్టు తప్పు పట్టింది అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ధరణిపై.. కేసీఆర్, కేటీఆర్ సర్వం కోల్పోయిన వాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారని ఆయన అన్నారు. ధరణి విషయంలో మమల్ని తీడుతున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తండ్రి, కొడుకులు ఒప్పుకున్నట్లే.. అధికారంలోకి వచ్చే పార్టీ ధరణి పోర్టల్ ను తీసేస్తామంటే తండ్రికొడుకులు ఎందుకు ఏడుస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులు.. చీకటి సామ్రాజ్యంతో చేసుకున్న ఒప్పందం బయట పడుతోందా అని ఆయన అడిగారు. కేసీఆర్ అక్రమాలపై.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ఇస్తానని రేవంత్ పేర్కొన్నారు.
Also Read: Gurukul School: ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు చిన్నారులకు పాముకాట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు
బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ధరణిలో ఉన్న కంపనీలు ఏంటో బయట పెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటే.. కిషన్ చెంద్రశేఖర్ రెడ్డి అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ధరణి కొనసాగిస్తాం అని బండి సంజయ్ చెప్పాడు.. కానీ కిషన్ రెడ్డి.. కేసీఆర్ ని కంటిన్యూ చేస్తానని అంటున్నాడు అని రేవంత్ అన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీలో మార్పులు చేర్పుల గురించి చెప్పాడు.. వాళ్లకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారు. బీసీ నాయకులకు సమావేశాలు పెట్టుకోండి అని మేమే చెప్పాం.. ముందు బీసీ నియోజకవర్గాల సీట్లనే ప్రకటిస్తామన్నాడు. అధిష్టానం కూడా తనకు అదే సూచన చేసిందని రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!