Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..
- రేవంత్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ భేటీ..
- కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు (శనివారం) జరుగబోతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపైన మంత్రివర్గంలో చర్చించి, క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగులకు పెండింగ్ డీఏలపైనా కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Papikondalu Tour: పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ఇక, గతంలో వివిధ శాఖలకు పంపించిన వీఆర్వోలు, వీఆర్ఏలతో ఈ పోస్టుల భర్తీకి నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మూసీ నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన రేవంత్ సర్కార్, తాజాగా ఓఆర్ఆర్ వెంట ఓపెన్ ప్లాట్స్ ఇవ్వాలని చూస్తుంది. మొత్తం 600 నుంచి-700 ఎకరాలను మూసి నిర్వాసితులకు కేటాయించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also: YVS Chowdary : అక్టోబర్ 30న తొలిసారి కనిపించనున్న ఎన్టీఆర్
అలాగే, రైతు భరోసా విధివిధానాలపై రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రైతు భరోసా గైడ్ లైన్స్ రూరూపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ నివేదికపైనా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ సమావేశాల తేదీలపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..