Madhusudhana Chary: తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు..
- బీఆర్ఎస్ని ప్రజలు మర్చిపోయారని బీజేపీ నూతన అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
- బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు అడుగు పెట్టగానే రాజా సింగ్ రాజీనామా చేశాడు..
- తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు: మాజీ స్పీకర్ మధుసూధనాచారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhusudhana Chary: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు అనే మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి తెలిపారు. ఆయనకు రాజకీయలా పట్ల అవగహన లేదని అర్ధం అవుతుంది.. అతడి మాటలతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపాలి అన్నారు. బీజేపీ బీసీని అధ్యక్షుడు చేస్తారని అన్నారు.. జాక్ పాట్ లాగా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు రామచందర్ రావు.. ఇక, ఆయన అడుగు పెట్టగానే రాజా సింగ్ కమలం పార్టీకి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రన మా పార్టీని తక్కువ చేసినట్లు కాదు.. దేశంలో గతం కంటే బీజేపీ స్థానాలు తక్కువ వచ్చాయి.. కానీ, తెలంగాణ సీట్లు పెరుగాయని మాజీ స్పీకర్ మధుసూదన చారి వెల్లడించారు.
Read Also: Patancheru Blast: పాశమైలారం ప్రమాదం: గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి చెప్పుకొచ్చారు. మాటలల్లో అనేకం చెప్పి, పనుల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ పాలన జరుగుతుంది.. తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఒక్కటే పని చేస్తుంది.. శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎంతో బీజేపీ పోటీ పడుతూ ఉంటుంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది అర్ధం పర్ధం లేని మాటలు.. ఇక, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాటల్లో తెలంగాణలో దోపిడీ కొనసాగితుందని తెలుస్తుంది.. మా పార్టీని బాద్నాం చేయడానికి ఈ రెండు పార్టీలు ఒకటవ్వలని చూస్తున్నాయి.. తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీలపై స్పష్టమైన అవగాహన ఉంది.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను చక్కదిద్దలేదు.. కేసీఆర్ పాలన పునరావృతం కావాలి ప్రజలు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణలో లేడని మధుసూధనాచారి తేల్చి చెప్పారు.
- Tags
- bjp
- BRS
- congress
- harish rao
- kcr
తాజావార్తలు
-
BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
-
Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
-
Ramayana: చైనాలో కొత్త టైటిల్తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
-
Electric Scooter Features: మీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయా? చాలామంది రైడర్లకు తెలియవు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!