BJP MP Laxman: మూసీ నివాసితులు గుబులులో ఉన్నారు..
- మూసీ నివాసితులు భయంలో ఉన్నారు
- అక్కడ జీవించే ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు
- ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు.. ప్రజల మీద ఎందుకీ ప్రతాపం: ఎంపీ లక్ష్మణ్
BJP MP Laxman: బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఎన్టీవీ మాట్లాడుతూ.. మూసీ నివాసితులు దయనీయమైన గుబులులో ఉన్నారని తెలిపారు. ఎంతో ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నమని తెలియజేస్తున్నారు.. లీ నాళి చేసుకుంటూ 40 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు.. వారి ఆవేదన వినడమే కాకుండా.. వారికి భారతీయ జనతా పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా మూసి ప్రక్షాళన చేయాలంటే.. అందుకు అనేకమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.. డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చి.. దానికి కావాల్సిన నిధులు కేటాయించండి.. ఆ రకంగా చేయకుండా మూసీ పరివాహక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాలేదు.. ప్రజల మీద ఎందుకీ ప్రతాపం?.. పేదలు చేసిన పాపం ఏంటి..? అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
Read Also: Pregnancy Job Scam: నిరుద్యోగులే టార్గెట్.. గర్భవతిని చేస్తే లక్షల్లో సంపాదన అంటూ మోసం
Also Read
అలాగే, 150 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు మార్కింగ్ చేయడం ఏంటి? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ క్వశ్చన్ చేశారు. ప్రభుత్వానికి చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు వ్యవహరిస్తున్నారు.. దున్నపోతు నిద్రలో ఉన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.. కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది.. మూసి ప్రక్షాళన పేరు మీద 150 కోట్లతో అవసరమా అని ప్రశ్నిస్తున్నా.. మూసి నిద్ర పేరు మీద ఒక్క రోజు కార్యక్రమం కాదు.. ఇది బీజేపీ తరపున ఒక హెచ్చరిక మాత్రమే అని ఆయన తెలిపారు. భవిష్యత్త్ లో ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి బీజేపీ నాయకులంతా కదం తొక్కారు.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలి.. పేదల జీవితాలతో చెలగాటం ఆడితే.. బుల్డోజర్లకు అడ్డం నిలబడైనా వారికి న్యాయం చేయడానికి మేము ఉన్నాం.. అర్ధాంతరంగా ఇండ్లు తొలగిస్తామని ఇక పక్ష నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తే.. మీ ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని లక్ష్మణ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!