Pregnancy Job Scam: నిరుద్యోగులే టార్గెట్.. గర్భవతిని చేస్తే లక్షల్లో సంపాదన అంటూ మోసం
- నిరుద్యోగులే టార్గెట్
- గర్భవతిని చేస్తే లక్షల్లో సంపాదన అంటూ మోసం
- అందమైన మహిళల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్
- మూడు నెలల్లోపు గర్భవతిని చేసేవారికి రూ.20 లక్షలు, కారు అంటూ మాయమాటలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులే వీరి టార్గెట్.. ఫేస్ బుక్లో నకిలీ ఫ్రొఫైల్స్ను సృష్టించి అబ్బాయిల నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. చాలా మంది యువకులు ఈ స్కామ్ లో చిక్కుకుపోయారు. ఈ స్కామ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, పురుషులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ స్కామ్లో అందమైన మహిళల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అందులో వారు మూడు నెలల్లోపు వారిని గర్భవతిని చేసేవారికి రూ.20 లక్షల రివార్డు, ఆస్తి, కారు ఇస్తామంటూ చెబుతారు.
Nayanathara- Dhanush: నయనతారా మీరు చేసేదేమన్నా సమాజ సేవా? ఎందుకీ పైత్యం?
Also Read
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
అంతేకాకుండా.. గర్భవతిని చేసే మగవాళ్లకు స్పెషల్ ఫీజులు కూడా ఇస్తామని పోస్ట్ చేస్తారు. ఈ పనిని గడువులోగా పూర్తి చేస్తే అధిక మొత్తంలో డబ్బు, ఆస్తులు ఇస్తామని ఆశ చూపుతారు. ఫేస్బుక్లో ఇలాంటి మోసపూరిత సందేశాలతో యువకులను ఆకర్షిస్తారు. ఆ తర్వాత డబ్బు చెల్లించి ఈ పని చేసేందుకు సిద్ధపడుతారు. ఈ స్కాంలో నేరస్థులు మొదట రిజిస్ట్రేషన్ ఫీజు (ప్రాసెసింగ్ ఫీజు) పేరుతో యువకుల నుండి డబ్బు వసూలు చేస్తారు. డబ్బు అకౌంట్లో చేరగానే.. వారితో కాంటాక్ట్ నిలిపివేస్తారు. ఆ తరువాత.. బాధితుడు మోసానికి గురవుతాడు. ఈ స్కాంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడతాడు. ఇటీవల, హర్యానాకు చెందిన ఒక బాధితుడు మాట్లాడుతూ..”మోసగాళ్లు నన్ను వివిధ రకాల ఫీజుల పేరిట డబ్బులు అడిగారు. ప్రతిసారీ ఓ కొత్త అబద్ధం చెప్పేవాళ్లు.” అని అన్నాడు. ఈ కుంభకోణంలో రూ.లక్షకు పైగా నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు.
Minister Narayana: రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి..
ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ‘ప్రెగ్నెన్సీ జాబ్’ స్కామ్ను సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఎనిమిది ఫేస్బుక్ గ్రూప్లను ఉపయోగించారు. ఈ గ్రూప్లలో మహిళల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ మహిళలను ప్రెగ్నెన్సీ చేసిన మగవారికి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెబుతారు. కాగా.. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో బీహార్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. అయితే ఫేస్బుక్లో ఇటువంటి ఫేక్ మెస్సెజ్లు వస్తుండటంతో పెద్ద నెట్వర్క్ ఈ స్కాంను నడుపుతున్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?