Pregnancy Job Scam: నిరుద్యోగులే టార్గెట్.. గర్భవతిని చేస్తే లక్షల్లో సంపాదన అంటూ మోసం
- నిరుద్యోగులే టార్గెట్
- గర్భవతిని చేస్తే లక్షల్లో సంపాదన అంటూ మోసం
- అందమైన మహిళల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్
- మూడు నెలల్లోపు గర్భవతిని చేసేవారికి రూ.20 లక్షలు, కారు అంటూ మాయమాటలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులే వీరి టార్గెట్.. ఫేస్ బుక్లో నకిలీ ఫ్రొఫైల్స్ను సృష్టించి అబ్బాయిల నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. చాలా మంది యువకులు ఈ స్కామ్ లో చిక్కుకుపోయారు. ఈ స్కామ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, పురుషులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ స్కామ్లో అందమైన మహిళల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అందులో వారు మూడు నెలల్లోపు వారిని గర్భవతిని చేసేవారికి రూ.20 లక్షల రివార్డు, ఆస్తి, కారు ఇస్తామంటూ చెబుతారు.
Nayanathara- Dhanush: నయనతారా మీరు చేసేదేమన్నా సమాజ సేవా? ఎందుకీ పైత్యం?
Also Read
- Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
అంతేకాకుండా.. గర్భవతిని చేసే మగవాళ్లకు స్పెషల్ ఫీజులు కూడా ఇస్తామని పోస్ట్ చేస్తారు. ఈ పనిని గడువులోగా పూర్తి చేస్తే అధిక మొత్తంలో డబ్బు, ఆస్తులు ఇస్తామని ఆశ చూపుతారు. ఫేస్బుక్లో ఇలాంటి మోసపూరిత సందేశాలతో యువకులను ఆకర్షిస్తారు. ఆ తర్వాత డబ్బు చెల్లించి ఈ పని చేసేందుకు సిద్ధపడుతారు. ఈ స్కాంలో నేరస్థులు మొదట రిజిస్ట్రేషన్ ఫీజు (ప్రాసెసింగ్ ఫీజు) పేరుతో యువకుల నుండి డబ్బు వసూలు చేస్తారు. డబ్బు అకౌంట్లో చేరగానే.. వారితో కాంటాక్ట్ నిలిపివేస్తారు. ఆ తరువాత.. బాధితుడు మోసానికి గురవుతాడు. ఈ స్కాంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడతాడు. ఇటీవల, హర్యానాకు చెందిన ఒక బాధితుడు మాట్లాడుతూ..”మోసగాళ్లు నన్ను వివిధ రకాల ఫీజుల పేరిట డబ్బులు అడిగారు. ప్రతిసారీ ఓ కొత్త అబద్ధం చెప్పేవాళ్లు.” అని అన్నాడు. ఈ కుంభకోణంలో రూ.లక్షకు పైగా నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు.
Minister Narayana: రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి..
ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ‘ప్రెగ్నెన్సీ జాబ్’ స్కామ్ను సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఎనిమిది ఫేస్బుక్ గ్రూప్లను ఉపయోగించారు. ఈ గ్రూప్లలో మహిళల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ మహిళలను ప్రెగ్నెన్సీ చేసిన మగవారికి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెబుతారు. కాగా.. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో బీహార్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. అయితే ఫేస్బుక్లో ఇటువంటి ఫేక్ మెస్సెజ్లు వస్తుండటంతో పెద్ద నెట్వర్క్ ఈ స్కాంను నడుపుతున్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
-
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
-
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
-
Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!