Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు.. అర్హులకు కార్డులిస్తాం
- రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ
- రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు అని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. అయినా రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని చెప్పారు. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రస్తుతం 90 లక్షల కార్డులు ఉండగా 2 కోట్ల 80 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 60 వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40 లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Railway : వీళ్ల కక్కుర్తి పాడుగానూ.. రైల్వే బెడ్షీట్లను లగేజీలో దాచిపెట్టిన కేటుగాళ్లు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6 కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సన్న బియ్యం పంపిణీ వల్ల 11 వేల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ప్రజా పాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేస్తున్నామని తెలిపారు. లిస్ట్లో పేర్లు రాని వాళ్లు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా ట్రిబ్యునల్ అంశంలో హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్ల విషయాల్లో కేసీఆర్-హరీష్ రావు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టారన్నారు. పోతిరెడ్డిపాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారని.. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 298 టీఎంసీలకు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Redmi Note 13 pro 5G: రెడ్మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!