Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు.. అర్హులకు కార్డులిస్తాం
- రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ
- రేషన్ కార్డులపై దుష్ప్రచారాన్ని నమొద్దు అని విజ్ఞప్తి
రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. అయినా రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని చెప్పారు. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రస్తుతం 90 లక్షల కార్డులు ఉండగా 2 కోట్ల 80 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 60 వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40 లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indian Railway : వీళ్ల కక్కుర్తి పాడుగానూ.. రైల్వే బెడ్షీట్లను లగేజీలో దాచిపెట్టిన కేటుగాళ్లు
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6 కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సన్న బియ్యం పంపిణీ వల్ల 11 వేల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ప్రజా పాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేస్తున్నామని తెలిపారు. లిస్ట్లో పేర్లు రాని వాళ్లు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా ట్రిబ్యునల్ అంశంలో హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్ల విషయాల్లో కేసీఆర్-హరీష్ రావు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టారన్నారు. పోతిరెడ్డిపాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారని.. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 298 టీఎంసీలకు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Redmi Note 13 pro 5G: రెడ్మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!