Minister Ponguleti: కాంగ్రెస్ని విలన్గా చిత్రీకరించే పనిలో కేసీఆర్ ఉన్నారు..
- కేసీఆర్ మంచి సూచనలు చేస్తారేమో అనుకున్నాం..
- కానీ, కేసీఆర్ మనసంతా విషం నింపుకున్నారు..
- కాంగ్రెస్ను విలన్గా చిత్రీకరించే పనిలో ఉన్నారు..
- కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది: మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నీ విలన్ గా చిత్రీకరించే పనిలో ఉన్నారు.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని ప్రశ్నించారు. కడుపులో విషం పెట్టుకుని కేసీఆర్ మాట్లాడారు.. కేసీఆర్ రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Motorola Edge 60 Pro: ఇట్స్ అఫీషియల్.. భారత్లో విడుదల కానున్న మోటొరోలా ఎడ్జ్ 60 ప్రో
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
ఇక, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కూడా రాలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం లేదు అని ఎద్దేవా చేశారు. గతంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా.. రైతులను వరి వేసుకోవద్దు అన్నారు.. కానీ, మీ ఫామ్ హౌస్ లో మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నారు అని ఆరోపించారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు పెట్టిన బాకీల కోసమే వాళ్ళు ధర్నా చేశారు.. సర్పంచుల గురించి మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ వచ్చాకా ఒక్క సర్పంచ్ కూడా పని చేయలేదు.. సర్పంచుల తిప్పలకి మీ పుణ్యమే కేసీఆర్ సమాధానం చెప్పు అని డిమాండ్ చేశారు. రూ. 1500 కోట్ల నిధులు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.. మీరు కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు.. మీ కుటుంబ సభ్యులకు వేలాది కోట్ల రూపాయలు వచ్చాయి.. గురివింద గింజ లాగా మాట్లాడకండి కేసీఆర్ అంటూ మంత్రి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
Read Also: EX CM KCR: 20-30% కమీషన్లు అని నేను అడగటం లేదు..
అయితే, రాహుల్ గాంధీ ఖమ్మం సభకు వస్తే.. సభను ఫెయిల్ చేయడానికి నిర్బంధం చేయలేదా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ సభకు బస్సులు కూడా ఇవ్వలేదు మీరు.. కానీ, మీ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇచ్చాం.. మేము ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మీ సభ జరిగేదా?.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కి ఉందా? అని ప్రశ్నించారు. మొగుడు.. పెళ్ళాం మాట్లాడుకున్న మాటలు కూడా విన్నది మీరు.. ఫోన్ ట్యాప్ చేసిన తొత్తులను అమెరికాలో దాచిపెట్టింది మీరు కాదా అని మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!