Hyderabad CP Anand: వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు..
- హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణంలో పండగలు జరుగుతున్నాయి..
- వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు..
- యాత్రలో పెద్ద స్పీకర్లు పెట్టుకోండి.. డీజేలు మాత్రం వద్దు: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad CP Anand: పీస్ కమిటీ సభ్యుల కారణంగా హైదరాబాద్ నగరంలో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుగుతున్నాయని నగర పోలీస్ బాస్ సీవీ ఆనంద్ తెలిపారు. వారం రోజుల క్రితమే శ్రీరామ నవమి శోభ యాత్ర ప్రశాంతంగా జరిగింది.. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ.. విజయవంతంగా పూర్తి చేశాం.. ఇప్పుడు వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి కూడా ఈ విజయ యాత్రలో పాల్గొంటారు.. సుమారు 12 కిలో మీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది.. సెన్సిటివ్ ఏరియాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం.. యాత్ర నిర్వాహకుల సహకారం కూడా ముఖ్యం అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Read Also: Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య 8 బంతులే ఆడాడు.. పంజాబ్ కోచ్ ఆసక్తికర విశేషాలు!
Also Read
- Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
ఇక, ర్యాలీ నిర్వహిస్తున్న నిర్వాహకులు బాధ్యత తీసుకొని, అందరిని సమన్వయం చేసుకుంటూ సాగాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు. కొత్తవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. 2010 తరువాత ఎప్పుడు గొడవలు జరగలేదు.. 2010 ముషీరాబాద్, మదన్న పేట్ లలో గొడవలు జరిగాయి.. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. పోలీసులు, నిర్వాహకులతో అందుబాటులో ఉంటూ యాత్రను ముందుకు తీసుకెళ్తాం.. ఖర్మన్ ఘాట్ నుంచి యాత్ర త్వరగా బయలుదేరేలా సూచించాం.. యాత్ర శనివారం జరుగుతుంది.. రెండవ శనివారం కాబట్టి సెలవు ఉంటుంది.. ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, యాత్ర నిర్వాహకులు సహకరించాలని సీవీ ఆనంద్ కోరారు.
Read Also: ‘Good Bad Ugly’ : అజిత్పై ప్రశంసలు కురిపించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్..
కాగా, బైబిల్ హౌస్ వద్ద రైల్వే బ్రిడ్జ్ దగ్గర గతంలో మాదిరిగా సమస్యలు రాకుండా వేరే మార్గంలో ముందుకు వెళ్ళాలని సీపీ ఆనంద్ సూచించారు. అయితే, శ్రీ రామనవమి సందర్భంగా ఒక ఉల్లంఘన జరిగింది.. కాబట్టి, డీజే వల్ల కలిగే నష్టాలు అందరికి తెలుసు.. నిర్వాహకులు కూడా డీజే విషయంలో నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తామన్నారు.. పెద్ద స్పీకర్లు పెట్టుకోవచ్చు కానీ డీజేలను మాత్రం అనుమతించము.. ఇక, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలో పెట్టకూడదు.. వర్షం పడే అవకాశం ఉంది.. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికపుడు సమన్వయం చేస్తూ ముందుకు సాగాలన్నారు. వాటర్ లాగిన్ పాయింట్స్ కు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి.. అలాగే, రాచకొండ పోలీసులు ఐపీఎల్ మ్యాచ్ ఉందని, మొత్తం తమపై పెట్టొద్దని మనవి.. యాత్ర పూర్తయ్యాక రిటర్న్ అయ్యే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.. జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల కాకుండా చూడాలి.. సుమారు 17 వేల మంది నగర పోలీసులతో పాటు 3 వేల మంది ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ బాస్ సీవీ ఆనంద్ చెప్పారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!