Hyderabad Veera Hanuman Vijaya Yatra: ఏప్రిల్ 2వ తేదీన శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భజరంగ్దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర.. ఈ ఏడాది కూడా కర్మన్ ఘాట్ నుండి ప్రారంభమై గౌలిగూడ రామ్ మందిరం చేరుకుంటుంది. అక్కడి నుండి సికింద్రాబాద్ లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర సాగనుంది.…
వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి కూడా ఈ విజయ యాత్రలో పాల్గొంటారు.. సుమారు 12 కిలో మీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది.. సెన్సిటివ్ ఏరియాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం: సీపీ సీవీ ఆనంద్