Shivaji Maharaj Jayanti: తెలుగు నేలపై నడయాడిన ఛత్రపతి శివాజీ..
- నేడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి..
- తెలుగు నేలపై నడయాడిన మరాఠా యోధుడు..
- హైదరాబాద్, శ్రీశైలంలో పర్యటించిన ఛత్రపతి శివాజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaji Maharaj Jayanti: మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, ధర్మ స్థాపన కోసం సామ్రాజ్యం స్థాపించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి నేడు. అయితే, ఛత్రపతి శివాజీ తెలుగు నేలపై నడయాడినట్లు తెలుస్తుంది. అయితే, పుణె, తుల్జాపూర్, పండరీపూర్ మీదుగా 1677 ఫిబ్రవరి నెలలో నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో లోకాయపల్లి రాణి లక్షమ్మ సంస్థానానికి వచ్చినట్లు సమాచారం. జైత్రయాత్ర పేరుతో వచ్చిన శివాజీ సైన్యంలోని కొందరిని ఇక్కడే వదిలి పెట్టి.. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మీదుగా గొల్కొండకు వెళ్లారంటున్నారు. ఇక, శివాజీ వెంట సుశిక్షితులైన 50 వేల మందితో కూడిన సైన్యం ఉండేది అని పేర్కొన్నారు. శివాజీ రాకకు గుర్తుగా హైదరాబాద్లోని పురానాపూల్ దగ్గర పెద్ద స్మారకాన్ని సైతం నిర్మించారు. అప్పట్లో మహామంత్రి మాదన్న నారాయణపేట ప్రాంతానికి వచ్చి శివాజీని స్వాగతిస్తూ ఆలింగనం చేసుకున్నారని అక్కడ నానూడి. శివాజీ నడుస్తుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు. నెల రోజుల పాటు తెలంగాణలోనే ఉండి అనంతరం శ్రీశైలానికి ఆయన తిరిగి వెళ్లిపోయాడని లోకాయపల్లి సంస్థాన చరిత్రలో పేర్కొన్నారు.
Read Also: Assam Congress: అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌరవ్ గొగోయ్..
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
ఇక, పద్మశాలి, కుర్ని, స్వకుల్ శాలి, జాండ్ర కులస్తులు గతంలో ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకంగా పని చేసేవారు. గద్వాల, పోచంపల్లి, బోధన్, కర్ణాటక, వాడి, గుల్బర్గా, షాపూర్ లాంటి ప్రాంతాల్లో శివాజీ జైత్రయాత్ర కొనసాగింది. అయితే, అప్పుడు సైన్యంలో పని చేసే కార్మికులు తెలంగాణ ప్రాంతంలో ఉంటూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి శివాజీ వెళ్లినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి. చేనేత రంగానికి పునాది వేసింది ఛత్రపతి శివాజీ అని ప్రజలు నమ్ముతారు.
తాజావార్తలు
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!