TG Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 30న కేబినెట్ భేటీ..
- ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతనరైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డులు,రైతుభరోసా కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి తర్వా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Read also: KetikaSharma : బర్త్ డే బ్యూటీ కేతిక శర్మ.. కిస్సిక్ ఫొటోస్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు పొందేందుకు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడంతో రేషన్ కార్డుల జారీ కీలకంగా మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు కావడంతో.. రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
Read also: Israel: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను చంపింది మేమే..
మరోవైపు తెలంగాణలో గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికే రైతు భరోసాపై ప్రకటనలు చేసినా.. అందుకు సంబంధించిన విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు. గత ఏడాది కాలంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా కల్పిస్తామని ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే రైతులకు ఎన్ని ఎకరాల్లో రైతు భరోసా కల్పించాలనే ప్రక్రియపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ ని కడిగిపారేస్తానంటున్న గరికపాటి
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..