Sonia Gandhi: సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ.. సారాంశమిదే..!
- సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ
- రేవంత్ సర్కార్ తెలంగాణ మహిళలను అవమానించారని లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ రాశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లేఖ రాశారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించిన సంఘటనలు రాష్ట్ర మహిళల ఆత్మ గౌరవాన్ని అవమానించే విధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను బానిసత్వం వైపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తోందని తెలిపారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అడుగడుగునా మోసం చేస్తోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే తన తీరు మార్చుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. విదేశీ మహిళలకు కాళ్లు కడిగించిన ఘటన తీవ్రమైన దుమారానికి, వివాదానికి దారితీస్తోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు, తల్లులకు, అక్కాచెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Tollywood: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు ములుగు, రామప్ప దేవాలయ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయంలోకి వెళ్లే ముందు అందాల భామలు కాళ్లు కడుక్కుని వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు నీళ్లు పోయడం వివాదాస్పదమైంది. తెలంగాణ మహిళలతో అందాల భామల కాళ్లు కడిగిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఇది తీవ్ర అవమానకరమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీఆర్ఎస్ మహిళా నేతలు.. సోనియాగాంధీకి లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..