Padi Kaushik Reddy : కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు..!
- నాడు కేసీఆర్ ప్రతి రైతుకు రైతు బంధు అందించారు
- రేవంత్ సీఎం అయి సంవత్సరం అయ్యింది... రైతులకు ఒకసారైనా రైతుబంధు వేశారా
- రైతు భరోసా ఎకరానికి 15 వేలు ఇచ్చేంత వరకు వదిలేది లేదు : పాడి కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని తరలిస్తూ తమ నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. అవసరమైతే కాలువ షెటర్లను పగులగొట్టి రైతులకు నీటిని అందిస్తానని ఆయన హెచ్చరించారు.
Also Read
Game Changer : “గేమ్ ఛేంజర్” హెచ్ డీ లీక్ భాద్యులు ఎవరంటే ?
తాను పోలీసులకు వ్యతిరేకం కాదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేవరకు పోరాటం కొనసాగిస్తానని, హుజురాబాద్ ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు రూ.1,16,000 అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోని సుఖ ప్రసవాల ప్రోత్సాహ పథకాన్ని ఉదహరిస్తూ, ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.13,000, మగపిల్ల పుట్టినప్పుడు రూ.12,000 అందించి, తల్లి బిడ్డలను అంబులెన్స్ ద్వారా ఇంటి వరకు తీసుకెళ్తారని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, తహసీల్దార్ కనకయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..