Padi Kaushik Reddy : కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు..!
- నాడు కేసీఆర్ ప్రతి రైతుకు రైతు బంధు అందించారు
- రేవంత్ సీఎం అయి సంవత్సరం అయ్యింది... రైతులకు ఒకసారైనా రైతుబంధు వేశారా
- రైతు భరోసా ఎకరానికి 15 వేలు ఇచ్చేంత వరకు వదిలేది లేదు : పాడి కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని తరలిస్తూ తమ నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. అవసరమైతే కాలువ షెటర్లను పగులగొట్టి రైతులకు నీటిని అందిస్తానని ఆయన హెచ్చరించారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
Game Changer : “గేమ్ ఛేంజర్” హెచ్ డీ లీక్ భాద్యులు ఎవరంటే ?
తాను పోలీసులకు వ్యతిరేకం కాదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేవరకు పోరాటం కొనసాగిస్తానని, హుజురాబాద్ ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు రూ.1,16,000 అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోని సుఖ ప్రసవాల ప్రోత్సాహ పథకాన్ని ఉదహరిస్తూ, ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.13,000, మగపిల్ల పుట్టినప్పుడు రూ.12,000 అందించి, తల్లి బిడ్డలను అంబులెన్స్ ద్వారా ఇంటి వరకు తీసుకెళ్తారని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, తహసీల్దార్ కనకయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!