Padi Kaushik Reddy : కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు..!
- నాడు కేసీఆర్ ప్రతి రైతుకు రైతు బంధు అందించారు
- రేవంత్ సీఎం అయి సంవత్సరం అయ్యింది... రైతులకు ఒకసారైనా రైతుబంధు వేశారా
- రైతు భరోసా ఎకరానికి 15 వేలు ఇచ్చేంత వరకు వదిలేది లేదు : పాడి కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని తరలిస్తూ తమ నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. అవసరమైతే కాలువ షెటర్లను పగులగొట్టి రైతులకు నీటిని అందిస్తానని ఆయన హెచ్చరించారు.
Also Read
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
Game Changer : “గేమ్ ఛేంజర్” హెచ్ డీ లీక్ భాద్యులు ఎవరంటే ?
తాను పోలీసులకు వ్యతిరేకం కాదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేవరకు పోరాటం కొనసాగిస్తానని, హుజురాబాద్ ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు రూ.1,16,000 అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోని సుఖ ప్రసవాల ప్రోత్సాహ పథకాన్ని ఉదహరిస్తూ, ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.13,000, మగపిల్ల పుట్టినప్పుడు రూ.12,000 అందించి, తల్లి బిడ్డలను అంబులెన్స్ ద్వారా ఇంటి వరకు తీసుకెళ్తారని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, తహసీల్దార్ కనకయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..