Nimmala Ramanaidu: వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదు.. ఆ సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం..
- వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదు..
- సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు..
- 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం..
- 2017లో నిర్వాసితులకు రూ 800 కోట్ల పరిహారం అందించిన చంద్రబాబే..
- మరలా ఇప్పుడు మరో రూ 800 కోట్లకు పైగా నిధులను అందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Ramanaidu: వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరం ప్రాజెక్ట్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు మంత్రి.. రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికారు మంత్రి నిమ్మల.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం, వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను 20 ఏళ్ల వెనక్కి తీసుకుపోయింది. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.. పోలవరంను విధ్వంసం చేసిన, నిర్వాసితులను నిర్లక్ష్యం చేసిన, డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్ కు, వైసీపీకి పోలవరం పై మాట్లాడే అర్హత లేదన్నారు..
Read Also: CM Chandrababu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ప్రతి ఒక్కరూ ఊరెల్లి నలుగురితో కలవాలి..
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతాం. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ కు పూర్తి చేసేలా పని చేస్తున్నాం అన్నారు మంత్రి నిమ్మల.. 2017లో నిర్వాసితులకు రూ 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే.. మరలా ఇప్పుడు మరో రూ 800 కోట్లకు పైగా నిధులను అందించారని తెలిపారు.. గత వైసీపీ పాలనలో నిర్వాసితులకు ఒక్క రూపాయు పరిహారం అందలేదు, నిర్వాసితుల కాలనీల నిర్మాణం జరగలేదు.. బిల్లుల చెల్లింపులు జరగలేదని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..