Flood in Hyderabad: మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్ లు.. భయాందోళనలో విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flood in Hyderabad: మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ లో సుమారు 15 హాస్టల్ లు నీట మునిగాయి. విద్యార్థులు బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే 30 అపార్ట్మెంట్లలోకి వరద నీరు కూడా చేరింది. ఒక్కో అపార్ట్మెంట్లో ఒక్కో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ అపార్ట్ మెంట్లలోనే ఉంటున్నారు. అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోకి వరద నీరు చేరడంతో ఆయా అపార్ట్మెంట్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు జేసీబీలను పిలిపించి అపార్ట్మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. కాగా, మైసమ్మగూడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షానికి అపార్ట్మెంట్లు ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు ఉదయం నుంచి భయంతో గడుపుతున్నారు.
Read also: Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
మేడ్చల్లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది ఈ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడ నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ అపార్ట్మెంట్లలోనే ఉంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. చెరువుకు నీటి మార్గంలో అపార్ట్మెంట్లు నిర్మించడంతో నీటి మార్గం లేకుండానే అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. ఇలాంటి నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Russia: పుతిన్, కిమ్ సమావేశం.. ఆయుధాల డీల్ కోసమే..
తాజావార్తలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్లో ఫ్యాన్స్!
-
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!