Flood in Hyderabad: మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్ లు.. భయాందోళనలో విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flood in Hyderabad: మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ లో సుమారు 15 హాస్టల్ లు నీట మునిగాయి. విద్యార్థులు బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే 30 అపార్ట్మెంట్లలోకి వరద నీరు కూడా చేరింది. ఒక్కో అపార్ట్మెంట్లో ఒక్కో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ అపార్ట్ మెంట్లలోనే ఉంటున్నారు. అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోకి వరద నీరు చేరడంతో ఆయా అపార్ట్మెంట్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు జేసీబీలను పిలిపించి అపార్ట్మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. కాగా, మైసమ్మగూడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షానికి అపార్ట్మెంట్లు ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు ఉదయం నుంచి భయంతో గడుపుతున్నారు.
Read also: Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
Also Read
మేడ్చల్లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది ఈ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడ నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ అపార్ట్మెంట్లలోనే ఉంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. చెరువుకు నీటి మార్గంలో అపార్ట్మెంట్లు నిర్మించడంతో నీటి మార్గం లేకుండానే అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. ఇలాంటి నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Russia: పుతిన్, కిమ్ సమావేశం.. ఆయుధాల డీల్ కోసమే..
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?