HarishRao: ఉస్మానియాలో 50 కీళ్ళుమార్పిడి ఆపరేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటళ్ళలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దార్శనికత పేదలకు మోయలేని భారాన్ని తగ్గిస్తున్నదన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయని మంత్రి తెలిపారు. సిద్ధిపేటలోని 23వ వార్డులో శ్రీరక్ష తల్లి, పిల్లల నవజాత శిశువుల దవాఖానను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం వేడుకలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
45 ఏళ్లు పైబడిన వారిలో మోకాళ్లలో సమస్య ఎక్కువగా వస్తుంది. వందలో 40 మందికి పైగా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులు.. మొత్తం నాలుగు దశల్లో సమస్య తీవ్రత చాటుతుంది. మొదటి, రెండు దశల్లో సాధారణ నొప్పులతో ఇంటి వరకే ఉంటుండగా.. తరువాత ఆసుపత్రులు చుట్టూ తిరగాలి. సమస్యకు పరిష్కారం లభించక పోతే వత్తిడి పెరుగుతుంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం.
1/2 pic.twitter.com/dxz0mkO84h— Harish Rao Thanneeru (@trsharish) April 25, 2022
కీలు మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా మోకాలి చిప్ప వెనుక భాగంలో ఉన్న ఎముకలను సవరించి.. కొంత మేర తొలగించి స్టీల్ రకం కృత్రిమ కీలు అమర్చుతారు. తొడ ఎముక, కాలు ఎముక కలిపే చోట ఈ మార్పు చేస్తారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సకు రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తుంటారు. అయితే తెలంగాణలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మోకాళ్లకు పట్టీలు అమర్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రులోనే లభ్యం కావడంతో పేదలకు మరింత వెసులుబాటు కలుగుతోంది. ఈ తరహా వైద్యం పేదలకు భారంగా మారకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తరహా కాస్ట్లీ ఆపరేషన్లు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..