HarishRao: ఉస్మానియాలో 50 కీళ్ళుమార్పిడి ఆపరేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటళ్ళలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దార్శనికత పేదలకు మోయలేని భారాన్ని తగ్గిస్తున్నదన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయని మంత్రి తెలిపారు. సిద్ధిపేటలోని 23వ వార్డులో శ్రీరక్ష తల్లి, పిల్లల నవజాత శిశువుల దవాఖానను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం వేడుకలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
45 ఏళ్లు పైబడిన వారిలో మోకాళ్లలో సమస్య ఎక్కువగా వస్తుంది. వందలో 40 మందికి పైగా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులు.. మొత్తం నాలుగు దశల్లో సమస్య తీవ్రత చాటుతుంది. మొదటి, రెండు దశల్లో సాధారణ నొప్పులతో ఇంటి వరకే ఉంటుండగా.. తరువాత ఆసుపత్రులు చుట్టూ తిరగాలి. సమస్యకు పరిష్కారం లభించక పోతే వత్తిడి పెరుగుతుంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం.
1/2 pic.twitter.com/dxz0mkO84h— Harish Rao Thanneeru (@trsharish) April 25, 2022
కీలు మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా మోకాలి చిప్ప వెనుక భాగంలో ఉన్న ఎముకలను సవరించి.. కొంత మేర తొలగించి స్టీల్ రకం కృత్రిమ కీలు అమర్చుతారు. తొడ ఎముక, కాలు ఎముక కలిపే చోట ఈ మార్పు చేస్తారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సకు రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తుంటారు. అయితే తెలంగాణలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మోకాళ్లకు పట్టీలు అమర్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రులోనే లభ్యం కావడంతో పేదలకు మరింత వెసులుబాటు కలుగుతోంది. ఈ తరహా వైద్యం పేదలకు భారంగా మారకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తరహా కాస్ట్లీ ఆపరేషన్లు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!