HarishRao: ఉస్మానియాలో 50 కీళ్ళుమార్పిడి ఆపరేషన్లు
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటళ్ళలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దార్శనికత పేదలకు మోయలేని భారాన్ని తగ్గిస్తున్నదన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయని మంత్రి తెలిపారు. సిద్ధిపేటలోని 23వ వార్డులో శ్రీరక్ష తల్లి, పిల్లల నవజాత శిశువుల దవాఖానను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం వేడుకలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
45 ఏళ్లు పైబడిన వారిలో మోకాళ్లలో సమస్య ఎక్కువగా వస్తుంది. వందలో 40 మందికి పైగా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులు.. మొత్తం నాలుగు దశల్లో సమస్య తీవ్రత చాటుతుంది. మొదటి, రెండు దశల్లో సాధారణ నొప్పులతో ఇంటి వరకే ఉంటుండగా.. తరువాత ఆసుపత్రులు చుట్టూ తిరగాలి. సమస్యకు పరిష్కారం లభించక పోతే వత్తిడి పెరుగుతుంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లలో అందిస్తున్నది.గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు,60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం.
1/2 pic.twitter.com/dxz0mkO84h— Harish Rao Thanneeru (@trsharish) April 25, 2022
కీలు మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా మోకాలి చిప్ప వెనుక భాగంలో ఉన్న ఎముకలను సవరించి.. కొంత మేర తొలగించి స్టీల్ రకం కృత్రిమ కీలు అమర్చుతారు. తొడ ఎముక, కాలు ఎముక కలిపే చోట ఈ మార్పు చేస్తారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సకు రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తుంటారు. అయితే తెలంగాణలో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మోకాళ్లకు పట్టీలు అమర్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రులోనే లభ్యం కావడంతో పేదలకు మరింత వెసులుబాటు కలుగుతోంది. ఈ తరహా వైద్యం పేదలకు భారంగా మారకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తరహా కాస్ట్లీ ఆపరేషన్లు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
-
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!