IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Bangladesh Broadcast: నేడు ఐపీఎల్ ప్రారంభం కానుంది. అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బంగ్లాదేశ్ను నుంచి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసారానికి బంగ్లాదేశ్లో మార్గం సుగమమైంది. దేశంలో ఈ టోర్నమెంట్ ప్రసారంపై ఎలాంటి ఆంక్షలు లేవని కొత్తగా నియమితులైన సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ధృవీకరించారు. క్రీడలతో రాజకీయాలను కలపడం తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో, కోల్కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని బీసీసీఐ కోరడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు ఆ పాత ఉత్తర్వులకు విలువ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. “మేము క్రీడల్లో రాజకీయాలను కలపదలుచుకోలేదు. ఏదైనా ఛానెల్ ఐపీఎల్ ప్రసారం కోసం దరఖాస్తు చేసుకుంటే సానుకూలంగా స్పందిస్తాం” అని మంత్రి స్వపన్ పేర్కొన్నారు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్లు కూడా బంగ్లాదేశ్లో ఐపీఎల్ను ప్రసారం చేసుకోవచ్చని, ప్రభుత్వం ఎవరినీ బలవంతం చేయదని లేదా అడ్డుకోదని వివరించారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఇదిలా ఉండగా.. గతంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను (Mustafizur Rahman) ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలంలో రికార్డు ధర రూ.9.2 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) దక్కించుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమైది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేయాలని బీసీసీఐ గతంలో కేకేఆర్కు ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..