China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- ఎర్ర సముద్రంలోని బాబ్ అల్-మండేబ్ మార్గంపై హౌతీలతో చైనా సంప్రదింపులు.
- చైనా చమురు ట్యాంకర్లకు సురక్షిత ప్రయాణం కల్పించడమే ప్రధాన లక్ష్యం.
- హౌతీలతో నేరుగా మాట్లాడిన తొలి దేశాల్లో చైనా ఒకటిగా సమాచారం.
- ఎర్ర సముద్ర ఉద్రిక్తతల మధ్య చైనా దౌత్య వ్యూహంపై ప్రపంచ దృష్టి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఇరుకైన సముద్ర మార్గం ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంలో చిక్కుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇరాన్ ప్రాక్సీ అయిన యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో అత్యంత కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ (Bab el-Mandeb)లో క్రియాశీలకంగా మారారు. ఈ మార్గం గుండా నౌకా ప్రయాణాలను వీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు.
అమెరికా, సౌదీ అరేబియాలు శత్రువులుగా భావించే హౌతీలతో ఇప్పుడు చైనా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల మధ్య తమ చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా హామీలు పొందడమే లక్ష్యంగా చైనా ఒప్పందానికి సిద్ధమైంది. జూలై 20న హౌతీలు బాబ్ అల్-మండేబ్ జలసంధిపై దిగ్బంధనాన్ని ప్రకటించిన తర్వాత ఆ మార్గంలో తమ నౌకలకు ఇబ్బందులు కలిగించొద్దని అనుమతి కోరిన తొలి దేశంగా చైనా మారింది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ఈ ‘‘కన్నీటి ద్వారం’’ ఎందుకు అంత కీలకం..?
బాబ్ అల్-మండేబ్ జలసంధిని అరబిక్లో “కన్నీటి ద్వారం” అని కూడా పిలుస్తారు. ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్తో కలుపుతూ, సూయజ్ కాలువ ద్వారా యూరప్లోకి వెళ్లేందుకు అత్యంత కీలమైన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా మధ్యప్రాచ్యం నుంచి చైనాకు భారీ స్థాయిలో చమురు, గ్యాస్ సరఫరా జరుగుతోంది. యూరప్, ఆఫ్రికా, ఆసియాల మధ్య వాణిజ్యంలో కీలకంగా మారింది.
ఈ మార్గం మూసుకుపోతే నౌకలు యూరప్ వెళ్లాలంటే దక్షిణాఫ్రికా లోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి అత్యంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ, ఇంధన ఖర్చులు పెరుగుతాయి.
మరోవైపు, ఈ వ్యూహాత్మక మార్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాలో జిబూటీలో చైనా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్థావరం ద్వారా ఎర్ర సముద్రంలో తన వాణిజ్య ప్రయోజనాలను, ఇంధన సరఫరాను పర్యవేక్షించే అవకాశం చైనాకు లభిస్తోంది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?