Bhatti Vikramarka : జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల రాష్ట్రాలకు భారీ నష్టం
- జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల రాష్ట్రాలకు భారీ నష్టం.. భట్టి హెచ్చరిక
- తెలంగాణకే రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం కోత
- 14% వృద్ధి హామీ విఫలం – కేవలం 7% గ్రోత్ మాత్రమే
- సెప్టెంబర్ 3 జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల ఏకగ్రీవ డిమాండ్లు
Bhatti Vikramarka : ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన తెలిపారు, “అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాలి. రేషనలైజేషన్ను మేము ఆహ్వానిస్తున్నాం కానీ, రాష్ట్రాలకు జరిగే నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలి” అని స్పష్టం చేశారు.
Medak : “మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు.. కొట్టుకుపోయిన రైల్వే లైన్”
Also Read
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ఎన్నో ప్రణాళికలు ఆధారపడి ఉంటాయని భట్టి గుర్తుచేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. తెలంగాణకే సుమారు 7 వేల కోట్ల రూపాయల నష్టం తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని అమలు చేసే సమయంలో కేంద్రం రాష్ట్రాలకు కనీసం 14 శాతం వృద్ధి హామీ ఇస్తామని చెప్పినా, వాస్తవానికి ఇప్పటికీ 7 శాతం మాత్రమే వృద్ధి వస్తోందని భట్టి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎనిమిది రాష్ట్రాలు ఏకగ్రీవంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. సెప్టెంబర్ 3న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ డిమాండ్లను లేవనెత్తాలని నిర్ణయించారు. అలాగే, అదే రోజు మళ్లీ ఆర్థిక మంత్రుల సమావేశం ఢిల్లీలో జరగనుంది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!