Bhatti Vikramarka : జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల రాష్ట్రాలకు భారీ నష్టం
- జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల రాష్ట్రాలకు భారీ నష్టం.. భట్టి హెచ్చరిక
- తెలంగాణకే రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం కోత
- 14% వృద్ధి హామీ విఫలం – కేవలం 7% గ్రోత్ మాత్రమే
- సెప్టెంబర్ 3 జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల ఏకగ్రీవ డిమాండ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన తెలిపారు, “అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాలి. రేషనలైజేషన్ను మేము ఆహ్వానిస్తున్నాం కానీ, రాష్ట్రాలకు జరిగే నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలి” అని స్పష్టం చేశారు.
Medak : “మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు.. కొట్టుకుపోయిన రైల్వే లైన్”
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ఎన్నో ప్రణాళికలు ఆధారపడి ఉంటాయని భట్టి గుర్తుచేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. తెలంగాణకే సుమారు 7 వేల కోట్ల రూపాయల నష్టం తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని అమలు చేసే సమయంలో కేంద్రం రాష్ట్రాలకు కనీసం 14 శాతం వృద్ధి హామీ ఇస్తామని చెప్పినా, వాస్తవానికి ఇప్పటికీ 7 శాతం మాత్రమే వృద్ధి వస్తోందని భట్టి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎనిమిది రాష్ట్రాలు ఏకగ్రీవంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. సెప్టెంబర్ 3న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ డిమాండ్లను లేవనెత్తాలని నిర్ణయించారు. అలాగే, అదే రోజు మళ్లీ ఆర్థిక మంత్రుల సమావేశం ఢిల్లీలో జరగనుంది.
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!