రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోనున్నాయి. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో ప్రభుత్వం వెబ్ సైట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్ సైట్లకు అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వుల జారీ నిలిచిపోనుంది.
read also : కరీంనగర్ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు !
అంటే.. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సేవల వినియోగం పెరగడంతో.. అన్ఇంటరప్టబుల్ పవర్ (యూపీఎస్) కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో కొత్త యూపీఎస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు శుక్రవారం నుంచి ఆదివారం రాత్రి వరకు ఏర్పడే అంతరాయాల గురించి అన్ని శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.