Praja Sangrama Yatra: బండి సంజయ్ ను కలిసిన గంగపుత్రులు.. జీవో 6ను రద్దు చేయాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Sangrama Yatra: మౌలాలిలోని మనీషా గార్డెన్స్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. గంగపుత్రులు కలిసారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. కులవృత్తులను కేసీఆఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 6 ను తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6 ను వెంటనే రద్దు చేయాలని వినితి పత్రంలో పేర్కొన్నారు. చేపలు పట్టే వృత్తి గంగపుత్రులకే హక్కుగా ఉండాలని డిమాండ్ చేశారు. గంగపుత్రులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కోరారు. గంగపుత్రుల హక్కులు కాలరాస్తూ ఇతరులకు మా కులవృత్తిని దాసోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర కులస్తుల నుండి రక్షణ కొరకు ఒక ప్రత్యేక గంగపుత్ర చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు.
వాజ్ పేయి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఎస్టీ జాబితాలో గంగపుత్రులను చేర్చాలని బండి సంజయ్ తో విన్నవించారు. దీంతో స్పందించిన బండి సంజయ్ మీ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని తెలిపారు. అన్ని కులాలు, అన్ని వర్గాలలోని అర్హులకు బీజేపీ తప్పక న్యాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు.
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
నిన్న టీఆర్ఎస్ నేతల్ని డంపింగ్ యార్డ్ వద్దే కట్టేయాలని.. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్.. మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్కు రావాలి’ అంటూ సవాల్ విసిరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కేసీఆర్ తనఖా పెట్టారని ఆరోపించిన బండి సంజయ్.. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. భూకబ్జాలతో టీఆర్ఎస్ నేతలు కోట్లు దండుకున్నారని విమర్శించిన విసయం తెలిసిందే.
Praja Sangrama Yatra: బండి సంజయ్ ను కలిసిన గంగపుత్రులు.. జీవో నెంబర్ 6ను రద్దు చేయాలని వినతి
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!