Hyderabad: గంట వ్యవధిలో మూడు రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. నగరంలో ఆదివారం తెల్లవారుజామున మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఇవాళ ఉదయం ఓ కొత్త వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వస్తున్న కొత్త కారు హుస్సేన్సాగర్ గ్రిల్స్ను బలంగా ఢీకొట్టింది. కారు హుస్సేన్ సాగర్లోకి సగానికి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులు ఉన్నారు. కారులోని ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం యువకులిద్దరూ కారును అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. ఆ తర్వాత కారు ఎవరిది, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టారు.
Read also: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో స్టీలు హుండీలు.. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన టీటీడీ
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
రాజేంద్రనగర్ ఆరంగర్ కూడలి వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని కారు, బైక్ ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం కారు డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుషాయిగూడ ఈసీఐఎల్ చౌరస్తా వద్ద కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. మౌలాలి నుంచి కుషాయిగూడ వైపు బైక్పై వస్తున్న క్రాంతి (33), నరేష్ (23) అనే ఇద్దరు యువకులు రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. అక్కడికక్కడే. క్రాంతి మౌలాలికి చెందిన వ్యక్తి కాగా, నరేష్ జనగామకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మూడు రోడ్డు ప్రమాదాలపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Viral Video: వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న లవర్స్.. ఇదేం పిచ్చి..
తాజావార్తలు
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!