Hyderabad: గంట వ్యవధిలో మూడు రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
Hyderabad: హైదరాబాద్ నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. నగరంలో ఆదివారం తెల్లవారుజామున మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఇవాళ ఉదయం ఓ కొత్త వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వస్తున్న కొత్త కారు హుస్సేన్సాగర్ గ్రిల్స్ను బలంగా ఢీకొట్టింది. కారు హుస్సేన్ సాగర్లోకి సగానికి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులు ఉన్నారు. కారులోని ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం యువకులిద్దరూ కారును అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. ఆ తర్వాత కారు ఎవరిది, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టారు.
Read also: Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో స్టీలు హుండీలు.. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన టీటీడీ
Also Read
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
రాజేంద్రనగర్ ఆరంగర్ కూడలి వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని కారు, బైక్ ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం కారు డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుషాయిగూడ ఈసీఐఎల్ చౌరస్తా వద్ద కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. మౌలాలి నుంచి కుషాయిగూడ వైపు బైక్పై వస్తున్న క్రాంతి (33), నరేష్ (23) అనే ఇద్దరు యువకులు రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. అక్కడికక్కడే. క్రాంతి మౌలాలికి చెందిన వ్యక్తి కాగా, నరేష్ జనగామకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మూడు రోడ్డు ప్రమాదాలపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Viral Video: వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న లవర్స్.. ఇదేం పిచ్చి..
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!
-
TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
-
Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!