Modi Hyd Tour : మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో ఫ్లెక్సీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని మోడీ నేడు హైదరాబాద్లోని ఇండియస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదనేది ఈ ఫ్లెక్సీలలోని సారాంశం.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఐఎస్బీని ఎస్పీజీ ఇప్పటికే ఆధీనంలో తీసుకుంది. దీంతో పాటు ప్రధాని రానున్న బేగంపేట ఎయిర్పోర్టు కూడా ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా.. ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న విద్యార్థుల బ్యాక్గ్రౌండ్తో పాటు వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లలో మోడీకి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు ఉన్నాయోనని పరీశీలించారు అధికారు. ఏమైనా వ్యతిరేకంగా ఉంటే.. ఐఎస్బీలోకి అనుమతిని నిరాకరించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
-
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
-
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!