Local Body Elections : ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
- తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగింపు
- ఎల్లుండి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
- 56 లక్షల మందికి పైగా ఓటర్లతో ఎన్నికల సమరం
- తొలి విడతలోనే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections : రాష్ట్రంలో గ్రామ పాలనకు సంబంధించి నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తొలి విడత పోలింగ్ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27 లక్షల 41 వేల 70 మంది పురుష ఓటర్లు ఉండగా, 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 201 మంది ఇతర (థర్డ్ జెండర్) ఓటర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
ఎన్నికల నిర్వహణ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కఠిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, తొలి విడతలోనే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడా పోటీ లేకుండా గ్రామ పాలక మండళ్లు ఎంపిక కావడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ అవసరం లేకుండా పోయింది. మిగిలిన గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుండగా, ప్రజల తీర్పుతో గ్రామ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పడనుంది.
Ind vs SA1st T20I: శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరిదంటే..?
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!