Ind vs SA1st T20I: శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరిదంటే..?
- భారత్–దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల T20 సిరీస్
- కటక్లో మొదటి మ్యాచ్ ప్రారంభం.
- టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
- భారత్ జట్టులో శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా మళ్లీ రీ-ఎంట్రీ.
- సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా బెంచ్లో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SA1st T20I: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల T20I సిరీస్ నేటి (మంగళవారం) నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ తొలి T20 మ్యాచ్ కటక్లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. మెడ పట్టేయడం కారణంగా మూడు వారాలకు పైగా గిల్ ఆటకు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్ కోలుకొని జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో గాయపడ్డాడు. సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు.
2026 MG Hector టీజర్ విడుదల.. స్పెక్స్, ఫీచర్లు, అంచనా ధరలు ఇవే..!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఇక మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కూడా 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్ట్జే ఈ మ్యాచ్ ద్వారా తిరిగి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ కటక్ మ్యాచ్తో వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. 2024లో T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ T20 క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 మ్యాచ్ లు గెలవగా.. కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక ఏ T20 సిరీస్నూ ఓడిపోలేదు కూడా. దక్షిణాఫ్రికాపై కూడా ఇదే విజయాన్ని కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Top 5 Electric Cars: 2026 లో విడుదల కానున్న టాప్ 5 EVల జాబితా ఇదే.. ఒక లుక్ వేయండి
టాస్ ఓడిపోయిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పర్వాలేదు. మేము వికెట్ను చూసి కొంచెం గందరగోళానికి గురయ్యాము. నిన్నటి కంటే ఈ రోజు పిచ్ కొంచెం ఆకుపచ్చగా ఉంది. మేము ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషిస్తున్నాము. ఎక్కువ పరుగులు చేసి, వాటిని డిఫెండ్ చేయడం ఒక మంచి ఛాలెంజ్. డ్యూ ఫ్యాక్టర్ (మంచు ప్రభావం) బౌలర్లకు కొంచెం సవాలుగా ఉంటుంది. మేము దానిపై మాత్రమే దృష్టి పెడితే.. ముఖ్యమైన పనిపై ప్రభావం పడుతుందని నేను భావిస్తున్నాను. మేము దాని గురించి ఆలోచించకుండా, ఒక సవాలుగా తీసుకుంటాము అని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!