Miyapur Firing: ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్పై కాల్పులు.. అసలు కథ ఇదీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miyapur Firing: బుధవారం రాత్రి హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మదీనాగూడలో ఓ ప్రముఖ హోటల్ మేనేజర్పై దుండగులు కాల్పులు జరపడంతో సందర్శకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఏం జరిగింది..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
హైదరాబాద్లోని మియాపూర్లో బుధవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్ గయాన్పై కాల్పులు జరిగాయి. దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో కోల్కతాకు చెందిన దేవేందర్ గయాన్కు తీవ్ర గాయాలయ్యాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న దేవేందర్ గయాన్ (35)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కంట్రీ మేడ్ గన్ నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే దేవేందర్ ప్రాణాలు వదిలాడు. దేవేందర్ స్వస్థలం కోల్ కతా అని పోలీసులు తెలిపారు.
కాల్పులకు గల పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు, మియాపూర్ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. బుధవారం రాత్రి 9:40 గంటలకు దేవేంద్రనాథ్ హోటల్ నుంచి బయటకు రాగా, హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అతనిపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని మాదాపూర్ డీసీపీ జీ సందీప్ తెలిపారు. గాయపడిన దేవేందర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలి అయితే దేవేందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడని
అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి గుర్తింపు.. కారణం ఇదీ..
మియాపూర్లో రిత్విక్ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రిత్విక్ బైక్పై వచ్చి హోటల్లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఆశ్రయం పొందిన ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మృతుడు సందర్శిని ఎలైట్ హోటల్లో ఆర్నెల్లుగా పనిచేస్తున్నాడు. సందర్శినీ హోటల్ మేనేజర్ దేవేందర్ బీదర్ నుండి నగరానికి ఓ యువతినీ తీసుకువచ్చినట్లు సమాచారం. యువతికి సికింద్రాబాద్ లో ఆశ్రయం కల్పించి సందర్శినీ హోటల్ లో హౌస్ కీపింగ్ లో 6 నెలల క్రితం దేవేందర్ ఉద్యోగం కల్పించాడు. అక్రమ సంబందం కారణంగానే రిత్విక్.. దేవేందర్ పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. 5 బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Astrology: ఆగస్టు 24, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..