Rain Effect : హైదారాబాద్లో ఎక్కడేమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి తగిన శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా పరిస్థితి ఇంతేనని పట్టించుకునే నాథుడు కరువయ్యాడని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
నల్లకుంట తిలక నగర్ వద్ద వర్షానికి భారీ వృక్షం నేలమట్టమైంది. వృక్షం నేలమట్టం కావడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి అక్కడ నుండి చెట్టును తొలగించాలి బస్తీ వాసుల డిమాండ్ చేస్తున్నారు. రసూల్పూరలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్ లోపలికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో కారు, టూవీలర్లతో పాటు సెల్లార్లో నివాసముంటున్న సెక్యూరిటీ ఇంట్లోని సామాన్లు నీట మునిగాయి.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
చిలకగూడలో రోడ్డు పై పడిపోయిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్ల పైకి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు చేరుకున్నారు. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇవేకాకుండా.. అత్తాపూర్ పోలీస్ ఔట్ పోస్ట్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో సీలింగ్ కూలిపోయింది. సిబ్బంది నీటిని బయటికి ఎత్తిపోస్తున్నారు. పోలీస్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్ బస్తీరి ఆనుకొని నిర్మిస్తున్న భవనం, గోవా కర్రలు కురిసిన భారీ వర్షానికి ఒక్క సారిగా కుప్ప కూలాయి. దీంతో బస్తీలో సుమారు 20 కి పైగా నివాసాలపై కప్పులు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో కరెంటు తీగలు కూడా తెగిపోవడంతో బస్తీ కి కరెంటు సరఫరా నిలిచిపోయింది. వీఎస్టీ సమీపంలోని నాగమయ్య కుంటలో ఇండ్ల పై భారీ వృక్షం కూలింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 5 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!