Rain Effect : హైదారాబాద్లో ఎక్కడేమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి తగిన శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా పరిస్థితి ఇంతేనని పట్టించుకునే నాథుడు కరువయ్యాడని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
నల్లకుంట తిలక నగర్ వద్ద వర్షానికి భారీ వృక్షం నేలమట్టమైంది. వృక్షం నేలమట్టం కావడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి అక్కడ నుండి చెట్టును తొలగించాలి బస్తీ వాసుల డిమాండ్ చేస్తున్నారు. రసూల్పూరలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్ లోపలికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో కారు, టూవీలర్లతో పాటు సెల్లార్లో నివాసముంటున్న సెక్యూరిటీ ఇంట్లోని సామాన్లు నీట మునిగాయి.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
చిలకగూడలో రోడ్డు పై పడిపోయిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్ల పైకి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు చేరుకున్నారు. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇవేకాకుండా.. అత్తాపూర్ పోలీస్ ఔట్ పోస్ట్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో సీలింగ్ కూలిపోయింది. సిబ్బంది నీటిని బయటికి ఎత్తిపోస్తున్నారు. పోలీస్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్ బస్తీరి ఆనుకొని నిర్మిస్తున్న భవనం, గోవా కర్రలు కురిసిన భారీ వర్షానికి ఒక్క సారిగా కుప్ప కూలాయి. దీంతో బస్తీలో సుమారు 20 కి పైగా నివాసాలపై కప్పులు దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో కరెంటు తీగలు కూడా తెగిపోవడంతో బస్తీ కి కరెంటు సరఫరా నిలిచిపోయింది. వీఎస్టీ సమీపంలోని నాగమయ్య కుంటలో ఇండ్ల పై భారీ వృక్షం కూలింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 5 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!