Ex Mp Ponnam Prabhakar: దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోము పోరాటం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex Mp Ponnam Prabhakar: సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోందని అన్నారు. వాస్తవంగా సింగరేణి లో ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని తెలిపారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారు. AMR కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది. వేలకోట్ల కుంభకోణం ఇది అని ఆరోపించారు. ఇందులో అవినీతి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. మరి 49 శాతం వాటా ఉన్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆగ్రమం వ్యక్తం చేశారు.
Read also: Unstoppable: మీరు ఎన్నడూ చూడని ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది…
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
ఈ అంశంపై సీబీఐ, ఈడీకి, బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే చెప్పారని తెలిపారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ బొగ్గు గనుల కేటాయింపు పై దర్యాప్తు సంస్థలతో విచారణకు అదేశించాలని కోరారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వద్దన్న వాళ్లు ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాడిచెర్ల గనుల కేటాయింపు ను రద్దు చేయాలి కేంద్రంకు ఆ అధికారం ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అవినీతి గురించి పొద్దున లేస్తే మాట్లాడే బీజేపీ.. బొగ్గుగనుల కేటాయింపులో అవినీతి పై కమలం నేతలు ఎందుకు చర్యలు తీసుకోరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని ఈ ఉదంతంతో మరోసారి రుజువయ్యిందని తెలిపారు. ప్రకృతి వనరులను దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోమని, కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
తాజావార్తలు
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..