Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సాజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు. తనుకు కోటీశ్వరుడినని చెప్పుకుని యువతులకు గాలం వేసేవాడు. ఏదో ఏదో కారణాలు చెప్పి ఆశ పడ్డ అమ్మాయిలనుంచి డబ్బులు లాగి వారిని మోసగించేవాడు. ఇలా చాలామంది అమ్మాయిలు ఈ మోసగాడి చేతిలో బలైపోయారు. ఈ క్రమంలోనే మావెలిక్కరకు చెందిన యువతి తనను ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి కొట్టాయం థియేటర్లో పోలీసులు సాజీని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
అసలేం జరిగిందంటే.. మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన చూసి సాజీ మావేలికర ప్రాంతానికి చెందిన మహిళను సంప్రదించాడు. తనకు ఉన్నత ఉద్యోగం ఉందని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని సాజీ మహిళను నమ్మబుచ్చాడు. ఆన్లైన్లో నిత్యం టచ్లో ఉండే సాజీ ఓ రోజు తన లగ్జరీ కారు ప్రమాదానికి గురైందని, దాన్ని రిపేర్ చేయడానికి రెండున్నర లక్షల రూపాయలు అవసరమని ఆ మహిళకు తెలిపాడు. వెంటనే తిరిగి ఇస్తానని చెప్పడంతో ఆ మహిళ సాజీకి డబ్బు పంపించింది. అయితే డబ్బు అందిన తర్వాత సాజీ మహిళతో సంబంధాలు కట్ చేశాడు. ఫోన్ కాల్స్ , మెసేజ్ లు ఆగిపోవడంతో ఆ యువతి తను మోసపోయినట్లు గుర్తించింది. అందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ సాజీని వ్యక్తిగతంగా కలిసింది లేదు. వీరిద్దరి పరిచయం కేవలం ఆన్ లైన్లో మాత్రమే.
Read Also: Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సాజీ తనకు పంపిన సెల్ఫీని సదరు మహిళ పోలీసులకు అందజేసింది. ఈ సెల్ఫీలో నిందితుడు ధరించిన టీషర్ట్పై హోటల్ పేరు రాసి ఉండడంతో నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు బృందానికి దోహదపడింది. టీషర్ట్పై పేరు ఉన్న హోటల్ను గుర్తించిన పోలీసులు నిందితుడి గురించిన సమాచారం సేకరించారు. తదుపరి విచారణలో, సాజీ మరో మహిళతో కొట్టాయంలో నివసిస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొట్టాయం, ఎర్నాకుళం, అలప్పుజ, పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లోనూ ఇదే తరహాలో సాజీ మోసానికి పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!