Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సాజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు. తనుకు కోటీశ్వరుడినని చెప్పుకుని యువతులకు గాలం వేసేవాడు. ఏదో ఏదో కారణాలు చెప్పి ఆశ పడ్డ అమ్మాయిలనుంచి డబ్బులు లాగి వారిని మోసగించేవాడు. ఇలా చాలామంది అమ్మాయిలు ఈ మోసగాడి చేతిలో బలైపోయారు. ఈ క్రమంలోనే మావెలిక్కరకు చెందిన యువతి తనను ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి కొట్టాయం థియేటర్లో పోలీసులు సాజీని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అసలేం జరిగిందంటే.. మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన చూసి సాజీ మావేలికర ప్రాంతానికి చెందిన మహిళను సంప్రదించాడు. తనకు ఉన్నత ఉద్యోగం ఉందని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని సాజీ మహిళను నమ్మబుచ్చాడు. ఆన్లైన్లో నిత్యం టచ్లో ఉండే సాజీ ఓ రోజు తన లగ్జరీ కారు ప్రమాదానికి గురైందని, దాన్ని రిపేర్ చేయడానికి రెండున్నర లక్షల రూపాయలు అవసరమని ఆ మహిళకు తెలిపాడు. వెంటనే తిరిగి ఇస్తానని చెప్పడంతో ఆ మహిళ సాజీకి డబ్బు పంపించింది. అయితే డబ్బు అందిన తర్వాత సాజీ మహిళతో సంబంధాలు కట్ చేశాడు. ఫోన్ కాల్స్ , మెసేజ్ లు ఆగిపోవడంతో ఆ యువతి తను మోసపోయినట్లు గుర్తించింది. అందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ సాజీని వ్యక్తిగతంగా కలిసింది లేదు. వీరిద్దరి పరిచయం కేవలం ఆన్ లైన్లో మాత్రమే.
Read Also: Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సాజీ తనకు పంపిన సెల్ఫీని సదరు మహిళ పోలీసులకు అందజేసింది. ఈ సెల్ఫీలో నిందితుడు ధరించిన టీషర్ట్పై హోటల్ పేరు రాసి ఉండడంతో నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు బృందానికి దోహదపడింది. టీషర్ట్పై పేరు ఉన్న హోటల్ను గుర్తించిన పోలీసులు నిందితుడి గురించిన సమాచారం సేకరించారు. తదుపరి విచారణలో, సాజీ మరో మహిళతో కొట్టాయంలో నివసిస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొట్టాయం, ఎర్నాకుళం, అలప్పుజ, పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లోనూ ఇదే తరహాలో సాజీ మోసానికి పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!