Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సాజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు. తనుకు కోటీశ్వరుడినని చెప్పుకుని యువతులకు గాలం వేసేవాడు. ఏదో ఏదో కారణాలు చెప్పి ఆశ పడ్డ అమ్మాయిలనుంచి డబ్బులు లాగి వారిని మోసగించేవాడు. ఇలా చాలామంది అమ్మాయిలు ఈ మోసగాడి చేతిలో బలైపోయారు. ఈ క్రమంలోనే మావెలిక్కరకు చెందిన యువతి తనను ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి కొట్టాయం థియేటర్లో పోలీసులు సాజీని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
అసలేం జరిగిందంటే.. మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన చూసి సాజీ మావేలికర ప్రాంతానికి చెందిన మహిళను సంప్రదించాడు. తనకు ఉన్నత ఉద్యోగం ఉందని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని సాజీ మహిళను నమ్మబుచ్చాడు. ఆన్లైన్లో నిత్యం టచ్లో ఉండే సాజీ ఓ రోజు తన లగ్జరీ కారు ప్రమాదానికి గురైందని, దాన్ని రిపేర్ చేయడానికి రెండున్నర లక్షల రూపాయలు అవసరమని ఆ మహిళకు తెలిపాడు. వెంటనే తిరిగి ఇస్తానని చెప్పడంతో ఆ మహిళ సాజీకి డబ్బు పంపించింది. అయితే డబ్బు అందిన తర్వాత సాజీ మహిళతో సంబంధాలు కట్ చేశాడు. ఫోన్ కాల్స్ , మెసేజ్ లు ఆగిపోవడంతో ఆ యువతి తను మోసపోయినట్లు గుర్తించింది. అందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ సాజీని వ్యక్తిగతంగా కలిసింది లేదు. వీరిద్దరి పరిచయం కేవలం ఆన్ లైన్లో మాత్రమే.
Read Also: Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సాజీ తనకు పంపిన సెల్ఫీని సదరు మహిళ పోలీసులకు అందజేసింది. ఈ సెల్ఫీలో నిందితుడు ధరించిన టీషర్ట్పై హోటల్ పేరు రాసి ఉండడంతో నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు బృందానికి దోహదపడింది. టీషర్ట్పై పేరు ఉన్న హోటల్ను గుర్తించిన పోలీసులు నిందితుడి గురించిన సమాచారం సేకరించారు. తదుపరి విచారణలో, సాజీ మరో మహిళతో కొట్టాయంలో నివసిస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొట్టాయం, ఎర్నాకుళం, అలప్పుజ, పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లోనూ ఇదే తరహాలో సాజీ మోసానికి పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!