Etela Rajender: కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Fires On CM KCR: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారానికి ఘోరీ కట్టాక.. హుజూరాబాద్ ప్రజలపై ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ సబ్ జైల్లో చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్తో కలిసిన తర్వాత మీడియాతో ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక శాడిస్ట్లా, సైకోలా ప్రవర్తిస్తున్నారని.. హుజూరాబాద్ పోలీసులు ప్రభుత్వ బానిసలుగా, అటెండర్లుగా పని చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు ఆపకపోతే.. ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మహేందర్ని అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన.. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2023 వరకే కేసీఆర్ అధికారంలో ఉంటారని, ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడ చేస్తారో చూస్తామని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ అతి తక్కువ కాలంలో ప్రజల ఆస్తులు దోచుకొని లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. అక్రమ సొత్తుతో దేశంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూపల్లి, పొంగులేటి తన మిత్రులని.. బీఆర్ఎస్ నాయకులతోనూ తనకు ఫోన్ సంభాషణలు ఉన్నాయని.. అందరి ఎజెండా కేసీఆర్ని ఓడించడమేనని పేర్కొన్నారు.
Cricket Betting Gang: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కమిషనర్ చౌహాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
అనంతరం.. హన్మకొండలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి 4 లక్షల కుటుంబాలుంటే, ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయని అన్నారు. నిరుద్యోగంతో మగ్గుతోంది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని దారపోస్తే, ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలేదన్నారు. కేసీఆర్ కేవలం దోచుకోవడానికి ఉన్నారని, ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదని ఆరోపించారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలుస్తుందని జోస్యం చెప్పారు. 4 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి కాబట్టి.. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి, మళ్లీ పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ పరీక్షలు నిర్వహించలేకపోతే.. కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ వేసిన సిట్పై ఎలాంటి నమ్మకం లేదన్నారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. తప్పుడు కేసులకు బీజేపీ భయపడదని అన్నారు. తమ జోలికొస్తే మాడి మసైపోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఎవరెవరు ఏం చేస్తున్నారో చిట్టా రాస్తున్నామని, రానున్న రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
-
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!