Etela Rajender: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Comments On CM KCR: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయజెండానే అని అన్నారు. ప్రజాసంబంధ పథకాలను కేసీఆర్ ఎప్పుడూ తీసుకురాలేదని.. పవర్ ఓరియెంటెడ్ పాలసీలనే తీసుకువస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ‘దళిత బంధు’ గుర్తుకు వచ్చిందని.. మునుగోడులో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ‘గిరిజన బంధు’ ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా దళితబంధు ఇస్తానన్న మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.
తాగుడు మీద ఆధాయం పెంచుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణ వచ్చినప్పుడు ఎక్సైజ్ ఆదాయం రూ.10,700 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.45,000 కోట్లకు చేరుకుందని అన్నారు. నెల మొదటి తారీఖు జీతం ఇవ్వకపోవడమే ధనిక రాష్ట్రమా అని ఈటెల ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేసీఆర్ చేతుల్లో మరమనుషులుగా మారారని ఆరోపించారు. 5800 ఎకరాల ఎస్సీల భూములను లాక్కున్న లాండ్ బ్రోకర్ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరి చూపు బీజేపీ వైపే ఉందని ఆయన అన్నారు.
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
Read Also: Kalvakuntla Kavitha: ఆ ఘనత ఒక్క కేసీఆర్దే.. రకరకాల మాటలు పట్టించుకోవద్దు
సీఎం ఉంటే ప్రగతి భవన్ లో లేదంటే ఫామ్ హౌజులో అని.. ఏ సీఎం అయినా సచివాలయాని వస్తారు.. ప్రజా సమస్యలు తెలుసుకుంటారు కానీ కేసీఆర్ రాజు, చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొత్త సచివాలయం కట్టే లోపు ఈ ప్రభుత్వం పోతుందని అన్నారు ఈటెల రాజేందర్. ఎక్కడ పడితే అక్కడ తెలంగాణలో మద్యం దొరుకుతుందని విమర్శించారు. సంక్షేమ పథకాలకు ఇచ్చేది రూ.26 వేల కోట్లని.. మద్యం ద్వారా లాక్కుంటోంది రూ.45 వేల కోట్లని ఈటెల అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటాయి కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటోందని విమర్శించారు.
చాయ్ అమ్ముకునే వారిని కూడా దేశప్రధానిగా చేసిన ఘనత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దే అని ఈటెల అన్నారు. తెలంగాణ ఏర్పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సాధ్యం అయిందని ఆయన అన్నారు. మోదీ గారి గురించి సీఎం కేసీఆర్ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని.. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయం అంటే అవినీతి అనే అభిప్రాయం ఉన్న దేశంలో అవినీతి మచ్చ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని పొగిడారు. ప్రపంచం భారతదేశాన్ని పొగుడుతుంటే.. కేసీఆర్ మాత్రం తిడుతున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
-
Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
-
ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
-
Prabhas : తన మూవీస్కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్
-
Financial Planning: ప్రతి తండ్రి 50 ఏళ్లలోపు.. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 7 ఆర్థిక ప్రణాళికలు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!