Sheep Scam: సంగారెడ్డిలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?
- సంగారెడ్డి జిల్లాలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?
- కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడంతో వెలుగులోకి
- గత 10 రోజులుగా సెలవులో అధికారి వసంత కుమారి
- కరోనాతో రెండున్నరేళ్ల క్రితం మృతి చెందిన కార్యాలయ ఉద్యోగి
- ఈ నెలాఖరు వరకు పూర్తి సమాచారం ఇస్తామంటున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కాగా సంగారెడ్డిలో గొర్రెల పంపిణీ పథకం డేటా గల్లంతు కావడం అధికారులకు షాక్ కు గురిచేసింది. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం, హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి సెలవులో ఉండటం గమనార్హం. కరోనాతో రెండున్నరేళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందింది. దీంతో ఉద్యోగి చనిపోవడంతోనే గత రెండున్నరేళ్లుగా డేటా అంతా స్ట్రక్ అయి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండున్నరేళ్లు అయినా డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై పెరుగుతున్న అనుమానాలు. మాన్యువల్ గా డేటాను సేకరిస్తున్నామంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు. ఈ నెలాఖరు వరకు విజిలెన్స్ అధికారులకి పూర్తి సమాచారం ఇస్తామంటున్నారు.
Also Read
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
కాగా, గొర్రెల పంపిణీపై ఇప్పటికే ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 10 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ స్కాంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కుంభకోణానికి సంబంధించిన వివరాలను కోరింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మోసానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీలాండరింగ్పై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర వివరాలను ఈడి కోరింది. గొర్రెల కొనుగోలుకు సంబంధించి సమాఖ్య ప్రభుత్వ ఖాతాల్లో ఏ జిల్లా అధికారులు జమ చేశారనే వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ అయిన నిధులు, ఏ ఖాతాల్లో జమ చేశారు? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి చెల్లించిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన మేత, ఏ లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరెవరికి నిధులు మంజూరయ్యాయనే వివరాల కోసం ఈడీ కోరింది.
Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!
తాజావార్తలు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!