Sheep Scam: సంగారెడ్డిలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?
- సంగారెడ్డి జిల్లాలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?
- కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడంతో వెలుగులోకి
- గత 10 రోజులుగా సెలవులో అధికారి వసంత కుమారి
- కరోనాతో రెండున్నరేళ్ల క్రితం మృతి చెందిన కార్యాలయ ఉద్యోగి
- ఈ నెలాఖరు వరకు పూర్తి సమాచారం ఇస్తామంటున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కాగా సంగారెడ్డిలో గొర్రెల పంపిణీ పథకం డేటా గల్లంతు కావడం అధికారులకు షాక్ కు గురిచేసింది. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం, హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి సెలవులో ఉండటం గమనార్హం. కరోనాతో రెండున్నరేళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందింది. దీంతో ఉద్యోగి చనిపోవడంతోనే గత రెండున్నరేళ్లుగా డేటా అంతా స్ట్రక్ అయి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండున్నరేళ్లు అయినా డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై పెరుగుతున్న అనుమానాలు. మాన్యువల్ గా డేటాను సేకరిస్తున్నామంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు. ఈ నెలాఖరు వరకు విజిలెన్స్ అధికారులకి పూర్తి సమాచారం ఇస్తామంటున్నారు.
Also Read
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
కాగా, గొర్రెల పంపిణీపై ఇప్పటికే ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 10 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ స్కాంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కుంభకోణానికి సంబంధించిన వివరాలను కోరింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మోసానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీలాండరింగ్పై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర వివరాలను ఈడి కోరింది. గొర్రెల కొనుగోలుకు సంబంధించి సమాఖ్య ప్రభుత్వ ఖాతాల్లో ఏ జిల్లా అధికారులు జమ చేశారనే వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ అయిన నిధులు, ఏ ఖాతాల్లో జమ చేశారు? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి చెల్లించిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన మేత, ఏ లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరెవరికి నిధులు మంజూరయ్యాయనే వివరాల కోసం ఈడీ కోరింది.
Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!