Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!
- కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు..
- తూర్పుగోదావరి జిల్లా పెరవలి చెందిన ఇద్దరు..
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో విషాదం అలుముకుంది. కువైట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మృతి చెందారు. బ్రతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్లిన వ్యక్తులు భారతీయ కార్మికులు నివాసముండే బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే..
Read Also: CM Revanth Tweet: ఒక జర్నలిస్టు నాకు ఫోటో పంపాడు.. అది చూస్తుంటే..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు బుధవారం కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి ముక్తేశ్వరరావు భార్య రాఘవులు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. 2వ కుమారుడు మొల్లేటి సత్యనారాయణ వయసు(38) ఇతనికి సుమారు 20 సంవత్సరాలు క్రితం అనంతలక్ష్మితో వివాహం అయింది. వీరికి వెంకట సాయి వయసు(19) కుమారుడు ఉన్నాడు. ఇతను ఉపాధి కోసం 12 సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లి.. ఒక సూపర్ మార్కెట్ లో హెల్పర్ గా పని చేస్తూ అక్కడ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండుమూడెళ్లకు ఒక్కసారి ఇండియాకు వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో గ్రామంలో సొంత ఇల్లు నిర్మాణం చేస్తే గృహ ప్రవేశంనకు వచ్చి వెళ్ళాడు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికీలలకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.
Read Also: Allahabad High Court: “ఎప్పుడూ మగవారిదే తప్పు కాదు”.. రేప్ కేసులో సంచలన తీర్పు..
అలాగే, పదేళ్ల క్రితం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన నారాయణరావు సీతామాలక్ష్మి దంపతుల కుమారుడు మీసాల ఈశ్వరుడు వయసు(40) ఇతను కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇతను పెద్దగా చదువుకోలేదు అని పోలీసులు తెలిపారు. అయితే, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ 10 సంవత్సరాల క్రితం కువైట్ దేశం వెళ్లారు. అప్పటి నుండి అక్కడ సూపర్ మార్కెట్లోనే పని చేస్తున్నాడు. తన భార్య చిట్టి కాసులు, కుమారుడు సాయి మణికంఠ, కుమార్తె కోమలి కృష్ణ కుమారి ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది అని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!