Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!
- కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు..
- తూర్పుగోదావరి జిల్లా పెరవలి చెందిన ఇద్దరు..
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో విషాదం అలుముకుంది. కువైట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మృతి చెందారు. బ్రతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్లిన వ్యక్తులు భారతీయ కార్మికులు నివాసముండే బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే..
Read Also: CM Revanth Tweet: ఒక జర్నలిస్టు నాకు ఫోటో పంపాడు.. అది చూస్తుంటే..
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు బుధవారం కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి ముక్తేశ్వరరావు భార్య రాఘవులు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. 2వ కుమారుడు మొల్లేటి సత్యనారాయణ వయసు(38) ఇతనికి సుమారు 20 సంవత్సరాలు క్రితం అనంతలక్ష్మితో వివాహం అయింది. వీరికి వెంకట సాయి వయసు(19) కుమారుడు ఉన్నాడు. ఇతను ఉపాధి కోసం 12 సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లి.. ఒక సూపర్ మార్కెట్ లో హెల్పర్ గా పని చేస్తూ అక్కడ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండుమూడెళ్లకు ఒక్కసారి ఇండియాకు వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో గ్రామంలో సొంత ఇల్లు నిర్మాణం చేస్తే గృహ ప్రవేశంనకు వచ్చి వెళ్ళాడు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికీలలకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.
Read Also: Allahabad High Court: “ఎప్పుడూ మగవారిదే తప్పు కాదు”.. రేప్ కేసులో సంచలన తీర్పు..
అలాగే, పదేళ్ల క్రితం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన నారాయణరావు సీతామాలక్ష్మి దంపతుల కుమారుడు మీసాల ఈశ్వరుడు వయసు(40) ఇతను కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇతను పెద్దగా చదువుకోలేదు అని పోలీసులు తెలిపారు. అయితే, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ 10 సంవత్సరాల క్రితం కువైట్ దేశం వెళ్లారు. అప్పటి నుండి అక్కడ సూపర్ మార్కెట్లోనే పని చేస్తున్నాడు. తన భార్య చిట్టి కాసులు, కుమారుడు సాయి మణికంఠ, కుమార్తె కోమలి కృష్ణ కుమారి ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది అని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!