చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా..?: డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీకి వచ్చారా అంటూ విమర్శించారు.చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా.. అంటూ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందద్దని చెప్పిన సీఎం కేసీఆర్, పూటకో మాట మారుస్తూ వరి వేస్తే ఉరి” అని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలనే సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు.
హుజురాబాద్ లో బీజేపీ గెలిచిన తర్వాత కేసీఆర్కి మతి చెలించిందన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయామనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని డీకే అరుణ ఆరోపించారు. కేంద్రమంత్రుల పై బూతులు మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధాన్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ ఎందుకు రైతుకు అండగా ఉండడం లేదు. “రైతు బంధు” ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.ఢిల్లీకి వచ్చిన మంత్రులు సేద తీరుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కార్యాలయం నిర్మాణం పై తిప్పలు పడుతున్నారు. రైతులను మోసం చేసే డ్రామాలు బంద్ చేయాలి.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
కేంద్రం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎం ఏది చెప్పితే, మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు.గ్రౌండ్ రియాలిటీ తెలియదా మంత్రులకు.. అంటూ ప్రశ్నించారు. ఏ మొఖం పెట్టుకొని మంత్రులు ఢిల్లీకి వచ్చారు. సీఎంకి ఎవరైనా లేఖ ఇస్తే తీసుకుంటారా? ఎవరికైనా ప్రజా సమస్యల పై సమయం ఇచ్చారా…? అని కేసీఆర్ను డీకె అరుణ నిలదీశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు డీకె అరుణ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్ షా చెప్పారని డికె అరుణ అన్నారు.
- Tags
- bjp
- Delhi
- DK Aruna
- kcr
- political news
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!