Diwali celebrations: దీపావళి వేడుకల్లో అపశృతి.. భారీగా ఆస్పత్రుల్లో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali celebrations: దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టపాసులు కాలుస్తూ.. దీపాలతో ఇండ్లన్నీ కాంతులతో విరజిల్లాయి. కుటుంబాల్లో ఆనంద కాంతులు వెలగాయి. కుటుంబం మొత్తం టపాసులు కాలుస్తూ నగరాల్లో సందడి వాతావరణం కనిపించింది. అయితే పలుచోటు టపాసులు కాలుస్తూ జరిగిన సంఘటనలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. టపాసులు కాలుస్తూ చాలామంతి పిల్లలకే గాయాలయ్యాయి. కొందరికి తీవ్ర గాయాలు కాగా ఏపీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ బాలుడు చనిపోయాడు. ఈఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also: Anand Mahindra: చర్చిల్కు ఇదే సమాధానం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
Also Read
- Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
- Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
దీపావళి వేడుకల్లో టపాసుల ఘటనలతో భాగ్యనగరంలో పలువురు గాయపడ్డారు. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడగా, ఉస్మానియా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రులకు బాధితులు క్యూ కట్టారు.గాయపడ్డ వారిలో అత్యధిక మంది చిన్నారులు ఉన్నారు. నగరంలో పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు…బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని, సరోజినీ దేవి ఆసుపత్రికి క్యూ.. ఇప్పటికే 41మంది ఔట్ పేషంట్స్ రాగా.. ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు, ఇద్దరికి కంటి ఆపరేషన్ పూర్తి, ముగ్గురు పిల్లలకి సీరియస్, దీపావళి వేడుకల్లో గాయాలైనవారికి చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశామని సరోజని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎక్కువ కేసులు వచ్చినా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బాధితుల్లో 5 మందికి సీరియస్ గా ఉందన్నారు. దీంతో.. ముగ్గురిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశామని, గాయపడ్డ వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నట్లు.. మరోవైపు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ లో కూడా 20 మంది వరకు గాయపడి వచ్చారు వాళ్లకి చికిత్స చేసి పంపినట్టు వైద్యులు తెలిపారు. దివాళీ పండుగను పురస్కరించుకొని ముందస్తు చర్యలు చేపట్టామని సరోజిని దేవి సివిల్ సర్జన్ నజఫీ బేగం తెలిపారు. ఇందులో భాగంగా.. ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు వైద్యులు, సిబ్బందిని పెట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!