Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dharmapuri Arvind Kumar Challenges Revanth Reddy On Hyderabad Demolitions

Dharmapuri Arvind : అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తోన్న హైడ్రాను.. ఓల్డ్ సిటీలో అమలు చేయగలరా..?

Published Date :February 16, 2025 , 5:53 pm
By Gogikar Sai Krishna
  • ఓల్డ్ సిటీలో హైడ్రా చర్యలు ఎందుకు లేవు?
  • ఎమ్మెల్సీ ఎన్నికలు – బీజేపీకి ఆదరణ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సంక్షోభం
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు: ఎంపీ అర్వింద్‌
Dharmapuri Arvind : అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తోన్న హైడ్రాను.. ఓల్డ్ సిటీలో అమలు చేయగలరా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dharmapuri Arvind : హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్, ఓల్డ్ సిటీలో కూడా ఇదే తీరుగా చర్యలు తీసుకోవాలా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన ధైర్యముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ-ముస్లింలపై ఆదాయంపై ఆధారపడి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భూ స్థాపితమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇక ప్రజల్లో ఆదరణ లేదని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ శకం ముగిసిపోయిందని అన్నారు.

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

భారతదేశాన్ని కాషాయమయం చేయడమే తన లక్ష్యమని స్పష్టంగా వెల్లడించిన ఎంపీ అర్వింద్, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు బాధ్యతగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తూ, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించిన ఎంపీ అర్వింద్, ప్రధాని మోడీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదన్నారు. హామీలు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి అవాస్తవ ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రజలు కూడా త్వరలో అదే విధంగా తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ సైతం నిజామాబాద్‌లో మాట్లాడుతూ, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు సత్తా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలక మలుపు తిప్పబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని అన్నారు. ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓటు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు.

కుల గణన పేరుతో బీసీల హక్కులను హరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించిన అర్వింద్, ముస్లింల కోసమే ఈ గణన చేపడుతున్నారని మండిపడ్డారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తిరిగి సర్వే ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజలను విసిగించిందని, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కుల రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Minister Seethakka: ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind kumar
  • bjp
  • Caste Census
  • congress
  • hyderabad

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions