NTV Telugu Site icon

Fake IPS Officer: నగరంలో నకిలీ ఐపీఎస్.. కొత్త టెక్నాలజీతో నేరాలు

Fake Ips Officer

Fake Ips Officer

Fake IPS Officer: హైదరాబాద్‌ లో ఇద్దరు నకిలీ ఐపీఎస్‌ లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్‌ అని చెప్పి పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టు బట్టబయలైంది. పోలీసులు ఆ వ్యక్తిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారు ఎప్పటి నుంచో ఈ నేరాన్ని కొనసాగిస్తున్నాడన్న కోణంలో విచారణ జరుగుతోంది.

బంజారాహిల్స్‌కు చెందిన రామ్‌ నకిలీ ఐపీఎస్‌ అధికారిగా మారాడు. ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ పదవులు, సెటిల్ మెంట్ల పేరుతో ఎంతో మంది అమాయకులను వలలో వేసుకున్నాడు. అలాగే అతి తక్కువ ధరకు జాగ్వార్ కార్లు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు తీసుకుని ప్రగల్భాలు పలికాడు. తాను ప్రత్యేక పోలీసు అధికారినని చెప్పుకుంటూ దాడులు కొనసాగిస్తున్నాడు. సైబరాబాద్‌లో కార్యాలయం తెరిచి అక్కడి నుంచే అక్రమ కార్యకలాపాలు కొనసాగించాడు. బాధితులందరినీ కార్యాలయానికి పిలిపించి సెటిల్ మెంట్లు చేయడం, విచారణ పేరుతో బాధితులను చిత్రహింసలు పెట్టడం వంటి పనులు చేస్తున్నాడు. తుపాకులు, పోలీసు వాహనాలు, సైరన్ల పేరుతో ఐపీఎస్ లకు బిల్డప్ ఇచ్చాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ట్రాప్‌ చేసి జార్ఖండ్‌కు తీసుకెళ్లింది. ఆమె వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకుని అక్కడే వదిలేశాడు.

దీంతో ఆమె జార్ఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ పోలీసులు విచారించగా నకిలీ ఐపీఎల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతనిపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఆరు కేసులను పోలీసులు గుర్తించారు. రామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తెలుగు వ్యక్తి అయినప్పటికీ హిందీ బాగా నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది మోసపోయినట్లు వెల్లడైంది. అలాగే పలువురు సెలబ్రిటీలు తమకు తెలిసిన వారిగా నటిస్తూ ఫేక్ ఫోటోలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఎంఎస్ ధోనీతో పాటు పలువురు సెలబ్రిటీలతో కలిసి ఫేక్ ఫోటోలు తయారు చేశాడు. ఈ ఫొటోలతో తాను సీనియర్ ఐపీఎస్ అధికారినని, పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. నిందితుడు ఇలాంటి ఎన్నో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read also: Farmers: రోడ్డెక్కిన రైతన్న.. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆందోళన

మరో నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారినని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అలియాజ్ నాగరాజుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ ఇన్‌ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్మీ కల్నల్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని నమ్మించి కార్తీక్ పలు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని మాదాపూర్ ఇన్‌ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతికంగా, ప్రభుత్వ అధికారులు ధోనీతో ఉన్నట్లుగా ఫోటోలు రూపొందించారని కార్తీక్ పేర్కొన్నాడు. వాటిని చూపించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని కార్తీక్ డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. అనేక సెటిల్ మెంట్లు చేసినట్లు గుర్తించారు. సైబరాబాద్‌లో కార్యాలయం తెరిచి సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని సమాచారం. అతనిపై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మధుసూదన్‌పై బెదిరింపులకు పాల్పడినందుకు పంజాగుట్టలో కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. కార్తీక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, 23 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ.2 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు