Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story We Will Not Accept Says Pm Modi As India Australia Vow Strict Action Against Temple Vandalism

PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు

Published Date :May 24, 2023 , 11:33 am
By Mahesh Jakki
PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు. సిడ్నీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై ఇటీవలి దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాలపై చర్చించారు. ప్రధాని మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే అంశాలను సహించబోమని అన్నారు. భవిష్యత్తులో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ తనకు హామీ ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియాతో సంబంధాలు టీ20 మోడ్‌లోకి ప్రవేశించాయని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాదిలోనే.. ఆ దేశ ప్రధానితో తాను ఆరుసార్లు సమావేశమైనట్లు గుర్తు చేశారు. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను చూసేందుకు రావాలని అల్బనీస్‌ను మోదీ ఆహ్వానించారు. ఆ సమయంలో దేశంలో దీపావళి సంబరాలు సైతం చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారని పేర్కొన్న మోదీ.. ఇరుదేశాల మధ్య వారు జీవ వారధిగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అల్బనీస్‌ను తన స్నేహితుడిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. మార్చిలో బ్రిస్బేన్‌లోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఆలయ సరిహద్దును ద్వేషపూరిత గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. జనవరి 23న, మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లోని ఇస్కాన్ దేవాలయం గోడలు ‘హిందూస్థాన్ ముర్దాబాద్’ అని రాసి ఉన్న గ్రాఫిటీతో ధ్వంసం చేయబడ్డాయి. జనవరి 16న, విక్టోరియా క్యారమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు దేవాలయం ధ్వంసం చేయగా, మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ దేవాలయం జనవరి 12న భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయబడింది.

Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆప్ నేత సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

సిడ్నీలో ప్రధాని మోదీ, ఆల్బనీస్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ వారు రక్షణ, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడు చర్యలను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు బహిరంగ, స్థిరమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నొక్కిచెప్పాయి.ద్వైపాక్షిక సమావేశానికి ముందు, సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. సందర్శకుల పుస్తకంపై సంతకం కూడా చేశారు. పపువా న్యూ గినియా మరియు జపాన్ పర్యటనలను ముగించుకుని సోమవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం సిడ్నీకి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సిడ్నీలో దిగగానే, నగరంలోని భారతీయ సమాజం ఆయనకు ఘనస్వాగతం పలికింది. ప్రధాన మంత్రి ఆస్ట్రేలియన్ అగ్రశ్రేణి వ్యాపార నాయకులను కలుసుకున్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్‌తో కలిసి ఖుడోస్ బ్యాంక్ అరేనాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో బ్రిస్బేన్‌లో కొత్త భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia
  • Australia PM Anthony Albanese
  • PM Modi
  • PM Narendra Modi
  • Prime Minister Narendra Modi

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions