PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు. సిడ్నీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై ఇటీవలి దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాలపై చర్చించారు. ప్రధాని మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్కు కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే అంశాలను సహించబోమని అన్నారు. భవిష్యత్తులో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ తనకు హామీ ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియాతో సంబంధాలు టీ20 మోడ్లోకి ప్రవేశించాయని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాదిలోనే.. ఆ దేశ ప్రధానితో తాను ఆరుసార్లు సమావేశమైనట్లు గుర్తు చేశారు. భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ను చూసేందుకు రావాలని అల్బనీస్ను మోదీ ఆహ్వానించారు. ఆ సమయంలో దేశంలో దీపావళి సంబరాలు సైతం చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారని పేర్కొన్న మోదీ.. ఇరుదేశాల మధ్య వారు జీవ వారధిగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అల్బనీస్ను తన స్నేహితుడిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. మార్చిలో బ్రిస్బేన్లోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఆలయ సరిహద్దును ద్వేషపూరిత గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. జనవరి 23న, మెల్బోర్న్లోని ఆల్బర్ట్ పార్క్లోని ఇస్కాన్ దేవాలయం గోడలు ‘హిందూస్థాన్ ముర్దాబాద్’ అని రాసి ఉన్న గ్రాఫిటీతో ధ్వంసం చేయబడ్డాయి. జనవరి 16న, విక్టోరియా క్యారమ్ డౌన్స్లోని శ్రీ శివ విష్ణు దేవాలయం ధ్వంసం చేయగా, మెల్బోర్న్లోని స్వామినారాయణ దేవాలయం జనవరి 12న భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయబడింది.
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆప్ నేత సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు
సిడ్నీలో ప్రధాని మోదీ, ఆల్బనీస్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ వారు రక్షణ, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడు చర్యలను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు బహిరంగ, స్థిరమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నొక్కిచెప్పాయి.ద్వైపాక్షిక సమావేశానికి ముందు, సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. సందర్శకుల పుస్తకంపై సంతకం కూడా చేశారు. పపువా న్యూ గినియా మరియు జపాన్ పర్యటనలను ముగించుకుని సోమవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం సిడ్నీకి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సిడ్నీలో దిగగానే, నగరంలోని భారతీయ సమాజం ఆయనకు ఘనస్వాగతం పలికింది. ప్రధాన మంత్రి ఆస్ట్రేలియన్ అగ్రశ్రేణి వ్యాపార నాయకులను కలుసుకున్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్తో కలిసి ఖుడోస్ బ్యాంక్ అరేనాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో బ్రిస్బేన్లో కొత్త భారత కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..