PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు. సిడ్నీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై ఇటీవలి దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాలపై చర్చించారు. ప్రధాని మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్కు కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సమావేశం తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే అంశాలను సహించబోమని అన్నారు. భవిష్యత్తులో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ తనకు హామీ ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియాతో సంబంధాలు టీ20 మోడ్లోకి ప్రవేశించాయని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాదిలోనే.. ఆ దేశ ప్రధానితో తాను ఆరుసార్లు సమావేశమైనట్లు గుర్తు చేశారు. భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ను చూసేందుకు రావాలని అల్బనీస్ను మోదీ ఆహ్వానించారు. ఆ సమయంలో దేశంలో దీపావళి సంబరాలు సైతం చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారని పేర్కొన్న మోదీ.. ఇరుదేశాల మధ్య వారు జీవ వారధిగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అల్బనీస్ను తన స్నేహితుడిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. మార్చిలో బ్రిస్బేన్లోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఆలయ సరిహద్దును ద్వేషపూరిత గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. జనవరి 23న, మెల్బోర్న్లోని ఆల్బర్ట్ పార్క్లోని ఇస్కాన్ దేవాలయం గోడలు ‘హిందూస్థాన్ ముర్దాబాద్’ అని రాసి ఉన్న గ్రాఫిటీతో ధ్వంసం చేయబడ్డాయి. జనవరి 16న, విక్టోరియా క్యారమ్ డౌన్స్లోని శ్రీ శివ విష్ణు దేవాలయం ధ్వంసం చేయగా, మెల్బోర్న్లోని స్వామినారాయణ దేవాలయం జనవరి 12న భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేయబడింది.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆప్ నేత సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు
సిడ్నీలో ప్రధాని మోదీ, ఆల్బనీస్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ వారు రక్షణ, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడు చర్యలను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు బహిరంగ, స్థిరమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నొక్కిచెప్పాయి.ద్వైపాక్షిక సమావేశానికి ముందు, సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. సందర్శకుల పుస్తకంపై సంతకం కూడా చేశారు. పపువా న్యూ గినియా మరియు జపాన్ పర్యటనలను ముగించుకుని సోమవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం సిడ్నీకి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సిడ్నీలో దిగగానే, నగరంలోని భారతీయ సమాజం ఆయనకు ఘనస్వాగతం పలికింది. ప్రధాన మంత్రి ఆస్ట్రేలియన్ అగ్రశ్రేణి వ్యాపార నాయకులను కలుసుకున్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్తో కలిసి ఖుడోస్ బ్యాంక్ అరేనాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో బ్రిస్బేన్లో కొత్త భారత కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!