Farmers: రోడ్డెక్కిన రైతన్న.. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda farmers: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొందరు మిల్లర్ల యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో గిట్టుబాటు ధర పేరుతో కొందరు మిల్లర్ల యజమానులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. వరిసాగుతో రైతులు పంటలు వేయాల్సి వస్తోంది. ఈ విషయమై అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించినా మిల్లర్ల యాజమాన్యాలు ఆందోళనలు విరమించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్న మాటలను పక్కన పెడితే మిల్లర్ల యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Read also: PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో ఉన్న రైస్ మిల్లు యజమానుల చేతివాటం చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లు దగ్గర.. IKP, PACS నుంచి వచ్చిన ధాన్యంలో.. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ-భువనగిరి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగ కుండా చూడలని ఉంటుంటే రైస్ మిల్లర్ల యజమానులు మాత్రం తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. ఒకవైపు వర్షం, మరో వైపు నష్టపోయిన పంటలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కొనేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తుయని చెబుతున్న మిల్లర్ల యజమానులు మాత్రం రైతుల బతుకులతో ఆట్లాడుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైస్ మిల్లర్ల ఆగడాలని స్వస్థి చెప్పాలని కోరుతున్నారు. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Bhatti Vikramarka: జడ్చర్ల నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర.. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలన
తాజావార్తలు
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!