KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఇంట్లో పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు దర్శకత్వం వహించిన “సంగీత పాఠశాల” సినిమా ఫంక్షన్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో పాటు హీరోయిన్ శ్రియ శరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే తన కొడుకు హిమాన్షుకి ఇప్పుడు 17 ఏళ్లు అని చెప్పిన కేటీఆర్.. మూడు నెలల క్రితం తాను కవర్ సాంగ్ పాడానని, దాన్ని కూడా విడుదల చేస్తున్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హిమాన్షు వాయిస్, టాలెంట్ చూసి షాక్ అయ్యానని చెప్పాడు. సింగింగ్లో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే హిమాన్షు ఆల్బమ్ను విడుదల చేశారని కేటీఆర్ అన్నారు. అదేవిధంగా చాలా మందిలో ప్రతిభ ఉందని, దానిని బయటకు తీసుకురావాలని తల్లిదండ్రులతో కేటీఆర్ అన్నారు.
Read also: New police stations: జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్
Also Read
తమ పిల్లలు దేనిపై ఆసక్తి చూపుతున్నారో తెలుసుకుని వారి బాటలో నడిచేలా చూడాలని సూచించారు. అయితే.. సినిమా పేరు మ్యూజిక్ స్కూల్.. కానీ ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ అంటూ ఇళయరాజాపై ప్రశంసలు కురిపించారు కేటీఆర్. ఇళయరాజాతో కలిసి వేదిక పంచుకోవడం గొప్ప గౌరవం. తెలంగాణలో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇళయరాజా ఒప్పుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం ఇళయరాజా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ చేస్తున్న సేవలను కొనియాడారు. సంగీతం నేర్చుకున్న చోట హింస ఉండదు. కేటీఆర్ విజ్ఞప్తిపై ఇళయరాజా స్పందిస్తూ.. సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పితే తనలాంటి 200 మందికి శిక్షణ ఇస్తామన్నారు. ఇళయరాజా అంగీకారంతో త్వరలో సంగీత పాఠశాలతో పాటు యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సంగీత పాఠశాల నిర్మాత పాపారావుతో పాటు చిత్ర బృందాన్ని కేటీఆర్ అభినందించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!