పంటను కొనేవారు లేక దిక్కులు చూస్తున్న రైతన్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు జరిగే మహబూబ్నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా రైతులు ధాన్యం కుప్పలను రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. వరిసాగు, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని, రాష్ర్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.
మరోవైపు చాలా జిల్లాలో లారీల రవాణా కాంట్రాక్టు, హమాలీల సమస్య కొలిక్కిరాలేదు. ధాన్యంలో తేమను లెక్కవేసేపరికరాలు, తూకం యంత్రాలు చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. వీటికీ ఓటీపీ సమస్య కూడా తోడవ్వడంతో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో రాష్ర్టంలో 61.75 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీని ప్రకారం1.35 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. స్థానిక అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాలకు పోగా 1.03 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో 6,873 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు కేవలం 5,461 కేంద్రాలను మాత్రమే తెరిచారు. కానీ 4,082 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గత నెల 25వ తేదీన అధికారికంగా కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ నెల రోజుల వ్యవధిలో కేవలం 16.76 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఇది లక్ష్యంలో కేవలం 15 శాతమే అవ్వడం గమనార్హం.
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
ఇటీవలి వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు మందగించాయి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదు. దీంతో 4వేల కేంద్రాల్లో రోజుకు కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా సేకరణ జరగడం లేదు. మంగళవారం రాష్ర్టంలో కొనుగోళ్లు ప్రారంభించిన 26 జిల్లాల్లో 95 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత యాసంగి సీజన్ ధాన్యం నిల్వలు రైస్ మిల్లులో, గోదాముల్లో నిల్వ ఉండటంతో అవి ఖాళీ అయ్యే పరిస్థితి ఆధారంగా కొత్త స్టాక్ను మిల్లులకు పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 16.76 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.3.281.71 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కాగా పౌర సరఫరాల సంస్థ ఆయా జిల్లాలకు రూ.912.62 కోట్లు విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 12,425 మంది రైతుల నుంచి కేవలం 96,673 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా కొనుగోలు లక్ష్యం 4.46 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం 54,015 టన్నులు మాత్రమే… దీంతో ధాన్యం సేకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమ్ ఇండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!