Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
- వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలతో ఏపీ డిస్కం మధ్య ఎంఓయూ..
- మున్సిపాల్టీలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waste-to-Energy: ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లోని వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలతో ఏపీ డిస్కం.. మధ్య ఎంఓయూ కుదిరింది. మున్సిపాల్టీలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ .. చెత్తను విద్యుత్ గా మార్చి సంపద సృష్టిస్తున్నాం అన్నారు. గుంటూరు లో 20 మెగావాట్లు, విశాఖలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో ప్రతి రోజూ 7500 మెట్రిక్ టన్నుల వేస్ట్ ఉత్పత్తి అవుతోందని.. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు… నెల్లూరు, కాకినాడ, కడప ,కర్నూలులో విద్యుత్ ఎనర్జీ కేంద్రాలతో డిస్కంల ఒప్పందం జరిగిందన్నారు. త్వరలో విజయవాడ, తిరుపతి లో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు సురేష్ కుమార్.. చెత్త కుప్పలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
ఇక, గత ప్రభుత్వం చెత్తపైన కూడా పన్నును వసూలు చేసిందన్నారు మంత్రి నారాయణ… వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను అలాగే ఉంచి పోయిందని.. అక్టోబర్ 2 నాటికల్లా నిల్వ ఉంచిన చెత్తనంతా తొలగించాలని సీఎం ఆదేశించారన్నారు. నారాయణ.. లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అధికారులు తరలించారని… చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో 10 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు నారాయణ.. ప్రస్తుతం.. విశాఖ, గుంటూరులో రెండు కేంద్రాల నుంచి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని.. నెల్లూరు, కాకినాడ, కడప , కర్నూలులో విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు.. ఇవాళ నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలులో ప్లాంట్లతో డిస్కంలు ఎంవోయూ చేసుకున్నాయని… రోజూ రాష్ట్రంలో 7500 టన్నుల చెత్త వస్తుండగా.. వాటన్నింటితో విద్యుత్ ఉత్పతి చేస్తాం అన్నారు నారాయణ… మరో రెండేళ్లలోనే మరో 6 కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని… మున్సిపార్టీల్లో పీపీపీ విధానంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు… విశాఖ, విజయవాడ, తిరుపతిలో రెండు నెలల్లో ఈ వేస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!